ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే కాక.. భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. తన దైన ఎటాకింగ్ ఆటతో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించగలడు. అందుకే సమకాలీన క్రీడా ప్రపంచంలో అతడిని మించిన ఫినిషర్ లేరని మాజీలు కితాబిస్తూంటారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ధోని గొప్పతన్నాన్ని, అతని అలవాట్లను ప్రశంసిస్తు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ అయిన హర్షా భోగ్లే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మహేంద్ర సింగ్ ధోని.. మైదానంలో ఎంత ప్రశాంతంగా కనిపిస్తాడో.. అంతే పరిణితితో బయటా వ్యవహరిస్తాడు. ఇక యువ ఆటగాళ్లను తయ్యారు చేయడంలో ధోనిని మించిన శాస్ర్తవేత్తలు లేరనే చెప్పాలి. ఈ క్రమంలోనే ధోని గురించి సీనియర్ కామెంటేటర్ అయిన హర్షా భోగ్లే పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు ధోనీ గురించి మాట్లాడుతూ.. ” ధోనిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. అవి ఇంత వరకు ప్రపంచానికి తెలిదనే అనుకుంటున్నాను. ఆ లక్షణాలను చూస్తే అసలు ధోని ఈ గ్రహం వాడేనా అన్న అనుమానం నాకు కలిగేది. నేను ఇన్ని సంవత్సరాల్లో ధోనిని కలిసింది కేవలం ఒక్కసారి మాత్రమే. ఇక అతడితో టచ్ లో ఉండటం అస్సలు కుదరదు.. ఎందుకంటే అతడు సెల్ ఫొన్ పట్టుకుని తిరగడు.” అని పేర్కొన్నాడు.
ధోని గురించి మరిన్ని విషయాలు పంచుకున్న భోగ్లే.. “పర్యటనలో భాగంగా ధోనికి కేటాయించిన రూమ్ తలుపులు ఎప్పుడూ తెరచుకునే ఉంటాయి. ఎవరైనా, ఏటీం వారైనా.. వచ్చి నేరుగా అతడితో మాట్లాడొచ్చు. రూమ్ సర్వీస్ బాయ్స్ కూడా ఆ వెసులు బాటు ఉంది.” అని వివరించాడు. “ఇక ధోనికి ఫోన్ మాత్రం మీరు చేయకండి అని సలహ ఇచ్చాడు. ఎందుకంటే అతడు ఫోన్ ఎక్కువగా క్యారీ చేయడు. మీరు గమనించారో లేదో ధోని ఎక్కువగా మీకు సోషల్ మీడియాలో కనిపించడు” అని హర్షా భోగ్లే పేర్కొన్నాడు. అందుకే అంటారు గొప్ప లక్షణాలు ఉన్న వాళ్లే గొప్ప నాయకులు అవుతారని. మరి మిస్టర్ కూల్ పై హర్ష భోగ్లే చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#HarshaBhogle about #MSD@bhogleharsha @msdhoni pic.twitter.com/e7edKIZRQK
— Fukkard (@Fukkard) September 8, 2022