అభిమానులకి మరింత వినోదాన్ని పంచడానికి క్రికెట్ లో తాజాగా మరొక రూల్ వచ్చి చేరింది. ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ మధ్య క్రికెట్ లో చాలా రకాల రూల్స్ చోటు చేసుకుంటున్నాయి. అభిమానులకి మరింత వినోదాన్ని పంచడానికి తాజాగా మరొక రూల్ వచ్చి చేరింది. అయితే ఈ రూల్ ఐసీసీ అమలు చేయడం లేదు. మొదటిసారిగా దేశవాళీ క్రికెట్ లో ఈ కొత్త రూల్ ని అమలు చేయడానికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. టీ 20 క్రికెట్ ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఇకపై ఒక్కో ఓవర్ కి రెండో బౌన్సర్లు వేసేందుకు అనుమతి ఇచ్చింది. భారత దేశవాళీలో భాగంగా జరిగే టీ 20 టోర్నీ అయినటువంటి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ రూల్ అమలు చేయనున్నారు. ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశవాళీ క్రికెట్ లో బౌలర్లకు శుభవార్త చెప్పింది బీసీసీఐ. బ్యాటర్ల భారతం పట్టడానికి బౌలర్లు ఇకపై టీ 20 ఫార్మాట్ లో కూడా రెండు బౌన్సర్లు వేయవచ్చని చెప్పుకొచ్చింది. సాధారణంగా టీ 20 లు అంటే బ్యాటర్లదే ఆధిపత్యం ఉంటుంది. కానీ ఇప్పుడు బౌలర్లకు 2 బౌన్సర్లు వేసే అవకాశం కల్పిస్తూ ఈ పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. గతంలో టెస్టు, వన్డేల్లో మాత్రమే ఓవర్ కి రెండు బౌన్సర్లు వేసుకోవచ్చనే అనుమతి ఉందేది. కానీ ఇప్పుడు తాజాగా ఆ లిస్టులోకి పొట్టి ఫార్మాట్ వచ్చి చేరింది. ఈ నిబంధన బౌలర్లకు సానుకూలంగా మారే అవకాశం ఉందని, బ్యాటర్లను ఇబ్బంది పెడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ జరగనుంది. ప్రస్తుతం బీసీసీఐ ప్రకటించిన రెండు బౌన్సర్ల రూల్ అనుకూల ఫలితాలు సాధిస్తే రానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఈ రూల్ ని అమలు చేయనున్నారు. అలాగే ఇంపాక్ట్ రూల్ లో కూడా కొన్ని మార్పులు చేసింది. ఇప్పటివరకు 14 ఓవర్ల లోపు వాడుకోవాలనే ఈ రూల్ ని తాజాగా ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలిపింది. మరి బీసీసీఐ అమలు చేస్తున్న ఈ రూల్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.