డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి ఖరారైంది. ఇంగ్లాండ్ లోని పిచ్ ల మీద మాకు విఫలమవడం మామూలే అన్నట్లు బ్యాటింగ్ చేశారు. టీమిండియాకు ఇది వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ పరాభవం కాగా.. ఆసీస్ మాత్రం తొలి ప్రయత్నంలోనే టైటిల్ ఎగరేసుకుపోయింది.
అందరూ ఊహించినట్లుగా కోహ్లీ మ్యాజిక్ ఏం చేయలేదు. రహానే తన క్లాస్ చూపించలేదు. ఇక కాస్తో కూస్తో ఆడతారనుకున్న శార్దూలు, జడేజా, భరత్ కూడా ప్రతిఘంటించలేకపోయారు. దీంతో ఐదవ రోజు టీమిండియా ప్రదర్శన కేవలం ఒక్క సెషన్ కే పరిమితమైంది. మ్యాచ్ ఆసాంతం అద్భుతమైన ఆట తీరుని కనబర్చిన కంగారూల టీంకే విజయం దక్కింది. దీంతో ఆస్ట్రేలియా ఐసీసీ టోర్నీలు అన్ని గెలిచినా తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. టీమిండియాకు ఇది వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ పరాభవం కాగా.. ఆసీస్ మాత్రం తొలి ప్రయత్నంలోనే టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇక గెలిచిన ఆస్ట్రేలియా టీంకి 13 కోట్లు టీమిండియాకు 6.5 కోట్లు లభించనున్నాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి ఖరారైంది. ఇంగ్లాండ్ లోని పిచ్ ల మీద మాకు విఫలమవడం మామూలే అన్నట్లు బ్యాటింగ్ చేశారు. 3 వికెట్లకు 164 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు బోలాండ్ ఊహించని షాకిచ్చాడు. వరుస బంతుల్లో కోహ్లీ, జడేజా వికెట్లను తీసి కోలుకోలేని దెబ్బ తీసాడు. ఇక ఆ తర్వాత రహానే, శార్ధూల్ ఠాకూర్ కూడా ఎక్కువసేపు గ్రీజ్ లో నిలబడలేకపోయారు. ఇక ఉమేష్ యాదవ్, భరత్, సిరాజ్ ఇలా వచ్చి లా వెళ్లిపోయారు. దీంతో 234 పరుగులు మాత్రమే చేసి 209 పరుగుల భారీ పరాజయాన్ని మూట కట్టుకుంది. ఆసీస్ బౌలర్లలో లియాన్ కి 4, బోలాండ్ కి 3 వికెట్లు దక్కగా.. స్టార్క్ కి 2, కమ్మిన్స్ కి ఒక వికెట్ లభించింది. మొత్తానికి మరోసారి ఐసీసీ నాకౌట్ లో చేతులెత్తేసిన భారత్ ఫ్యాన్స్ ని బాగా నిరాశపరిచింది.