తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దుండగుల దాడి జరిగింది. కొందరు దుండగులు శనార్తి తెలంగాణ కార్యాలయంలోకి చొరబడి తీన్మార్ మల్లన్నపై దాడి చేశారు. అక్కడున్న ఫర్నిచర్, కంప్యూటర్స్ అన్నింటిని ధ్వసం చేశారు. ఇదంతా టీఆర్ఎస్ గూండాల పనే అంటూ తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. తాజాగా మల్లన్న తన ఛానల్ లో హిమాన్షుపై బాడీ షేమింగ్ చేస్తూ ఒక పోల్ ను కండక్ట్ చేశారు. ఆ పోల్ తో టీఆర్ఎస్ వర్గాలు ఆగ్రహంతో ఊగిపోయాయి.
అయితే మల్లన్న మాత్రం తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైనట్లు చెబుతున్నారు. తన ఖాతా ఎవరో హ్యాక్ చేసి ఆ పోల్ కండక్ట్ చేశారని.. దాంతో తనకి ఎలాంటి సంబంధం లేదంటూ వెల్లడించారు. ఇలాంటి నేపథ్యంలో ఈ దాడి జరగడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణం అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A slap on a BJP karyakarta is a slap back on this whole TRS govt…the leaders of @trspartyonline are getting extremely impatient and frustrated as they see their dark future ahead…you’ll get your deeds back..not from @TeenmarMallanna alone but by the people of Telangana!#mindit pic.twitter.com/lKcro4wCSs
— kasireddy Sindhu Reddy (@iksindhureddy) December 24, 2021