రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుల్లో మంత్రి కేటీఆర్ ఒకరు. చాలా సందర్భాల్లో ట్వీటర్ వేదికగా ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే డా. BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల కోసం సిద్దమయ్యే వారి కోసం ఓపెన్ యూనివర్సీటీ స్టడీ మెటీరియల్ ను రూపోందించింది. ఆ మెటీరియల్ ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పరోక్షంగా కేంద్రం పై విరుచుకుపడ్డారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
డా. BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పట్టించుకోకుండా మతాల పేరుతో కొట్టుకోవాలని ఏ దేవుడు చెప్పాడు మీకు” అంటూ పరోక్షంగా కేంద్రాన్ని ప్రశ్నించాడు. అలాగే నీటి పారుదల రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని గురించి తెలుసుకొకుండా విపక్షాలు విమర్శలు చేయడం తగదని సూచించారు.
అలాగే ఇటీవల రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గారి గ్రామానికి నిన్నగాక మెున్న కరెంట్ వచ్చిందంటే మన దేశ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు అని మండిపడ్డాడు. మతాల పేరుతో, దేవుళ్ల పేరుతో ఎందుకు కొట్టుకుంటున్నారని ప్రశ్నించాడు. అందుకే మన దేశం ఇంకా వెనకబడిందని పేర్కొన్నాడు. చైనా ఇలాంటివన్నీ పట్టించుకోదు కాబట్టే అభివృద్ధిలో మనకంటే ముందుందని గుర్తు చేశారు.
మరిన్ని విషయాల గురించి మాట్లాడుతూ..” సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఎన్నో కష్టాలను అధిగమించి 8 సంవత్సరాల్లో2.22 లక్షల ఉద్యోగాలను కల్పించాం. అందరికి ఉద్యోగాలు ఇవ్వడం ప్రపంచంలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు అందుకే ప్రైవేట్ కంపెనీలను స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణ కు కేంద్రం ఒక్క విద్యా సంస్థను కేటాయించక పోవడం దారుణం” అంటూ మండి పడ్డారు. మరి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Which God told you to fight against each other ?
Minister @KTRTRS pic.twitter.com/r3QOs8zC65
— krishanKTRS (@krishanKTRS) August 27, 2022
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రూపొందించిన స్టడీ మెటీరియల్ ను మంత్రులు @KTRTRS, @SabithaindraTRS నేడు ఆవిష్కరించారు. pic.twitter.com/97ePqZ0CoO
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 27, 2022