విశాఖపట్నం సముద్ర తీరంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. చేపల కోసం వలేస్తే.. ఏకంగా వారికి ఓ అనుకోని అరుదైన అతిథి చిక్కింది. ప్రపంలోనే అతి పెద్ద చేప వేల్ షార్క్ చిక్కింది. ఆ వివరాలు.. తంతిడి బీచ్లో చేపల కోసం వల వేసిన మత్స్యకారులకు ఈ భారీ చేప చిక్కింది. ఈ చేప 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉంది. విశాఖ డీఎఫ్వో అనంత్శంకర్ ఆదేశాలతో సిబ్బంది వెంటనే తంతడి బీచ్కు చేరుకున్నారు.
తంతడి బీచ్ వద్ద ఉన్న భారీ చేపను పరిశీలించిన వారు.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద చేప వేల్షార్క్ అని తెలిపారు. ప్రస్తుతం ఈ జాతి అంతరించిపోతుందని చెప్పారు. ఈ భారీ చేపను సముద్రంలోకి సురక్షితంగా వదిలిపెట్టాలని డీఎఫ్వో అనంత్శంకర్ సూచించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది, మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకులు షార్క్కు ఫిల్టర్ ఫీడింగ్ ఇచ్చారు. అనంతరం షార్క్ను సురక్షితంగా సముద్రంలోకి వదిలిపెట్టారు.