విధి కొందరి పట్ల చాలా నిర్దయగా వ్యవహరిస్తుంటోంది. గోరు చుట్టూ మీద రోకలి పోటు చందంగా పరిస్థితులు కల్పిస్తోంది. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకునే ఓ మహిళ పరిస్థితి కూడా అలాంటిదే. చూడటానికి మహిళ అయినప్పటికీ.. మామాలూ మనుషుల్లా ఆమె తీరు లేదు
విధి కొందరి పట్ల చాలా నిర్దయగా వ్యవహరిస్తుంటోంది. గోరు చుట్టూ మీద రోకలి పోటు చందంగా పరిస్థితులు కల్పిస్తోంది. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకునే ఓ మహిళ పరిస్థితి కూడా అలాంటిదే. చూడటానికి మహిళ అయినప్పటికీ.. మామాలూ మనుషుల్లా ఆమె తీరు లేదు. దీనికి తోడు ఆమె కడుపులో మరో బిడ్డ. తాను కడుపు నింపుకోవడమే కాదూ.. కడుపులోని బిడ్డకు కూడా సరిపడా ఆహారం తీసుకోలేని నిస్సహాయ స్థితి. ఆమె దయనీయమైన పరిస్థితిని చూసి తల్లిడిల్లిపోయారు స్థానికులు. గూడు, నీడ లేని ఆ మహిళను దగ్గరకు తీసుకుని, వివరాలు అడిగితే తెలిసింది ఏంటంటే.. ఆమె ఓ మానసిక వికలాంగురాలని. తన వారెవ్వరో చెప్పలేని పరిస్థితుల్లో ఉంది ఆమె.
ఉట్నూరులో ఓ గర్బిణీ దిక్కుతోచని స్థితిలో ఉండటాన్ని గమనించారు స్థానికులు. కొన్ని రోజులుగా ఓ శ్మశాన వాటికలో నివసిస్తూ.. అక్కడే ఉన్న చెత్తా చెదారంలో పాడైపోయిన ఆహార పదార్ధాలు తింటూ జీవనం సాగిస్తుండటాన్ని పరిశీలించి.. ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే ఆమె సరిగ్గా వివరాలు చెప్పలేకపోయింది. అయితే ఆమె చెప్పిన కొన్ని వివరాల ప్రకారం.. కొమురం భీం జిల్లా కెరమెరి మండలం చిన్నుగూడ ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించారు. ఇంటి నుండి తప్పిపోయిన మహిళ.. మానసిక స్థితి సరిగ్గా లేక.. 60 కిలో మీటర్లు అడవిలో ప్రయాణించి ఉట్నూరుకు చేరుకుంది.
సదరు మహిళ అక్కడ శ్మశాన వాటికలో కొన్ని రోజులుగా ఉండటాన్ని గుర్తించిన పారిశుద్ధ కార్మికులు.. స్థానికులకు సమాచారం అందించారు. స్థానికులు మహిళ వివరాలు అడిగ్గా.. మానసిక స్థితి సరిగ్గా లేదని గుర్తించారు. ఆ తర్వాత ఆదరించి, స్నానం చేయించారు. అనంతరం పోలీసుల సహకారంతో ఆ మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఆరా తీయడంతో ఆ గర్భిణిది కొమురంభీం జిల్లా కెరమెరి మండలం హట్టి గ్రామం అని తెలియడంతో షీటీమ్ బృందం సహకారంతో ఆమెను ప్రత్యేక వాహనంలో సురక్షితంగా సొంతూరుకు చేర్చారు. ప్రస్తుతం ఆ నిండు గర్భిణీ ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు