ఫిల్మ్ డెస్క్- ప్రీరిలీజ్ పంక్షన్.. ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న ప్రేమ. ఒకప్పుడు పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్ సినిమాలకు మాత్రమే ప్రీరిలీజ్ ఫంక్షన్స్ చేసే వారు. కానీ ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలకు సైతం ప్రీరిలీజ్ వేడుకలు చేస్తున్నారు. ఇక ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్స్ లో ఈ సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు మేకర్స్. సహజంగానే సినిమా వాళ్లు ఒకరిని ఒకరు పొగుడుకోవడంలో పోటీ పడుతుంటారు. మరి అదే ప్రీరిలీజ్ ఫంక్షన్స్ లో ఐతే ఇక చెప్పక్కర్లేదు. సినిమా అలా ఉంది, ఇలా ఉంది అంటూ అదరగొడుతుంటారు.
అసలు విషయం ఏంటంటే.. హీరో శ్రీ విష్ణు తాజాగా రాజ రాజ చోర సినిమాతో మన ముందుకు వచ్చారు. అంతకు ముందు గాలి సంపత్ సినిమాలో హీరోగా నటించారు శ్రీ విష్ణు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఇక రాజ రాజ చోర సినిమీ ప్రీరిలీజ్ వేడుకలో శ్రీ విష్ణు కాస్త ఏమోషనల్ గా మాట్లాడారు. సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు.
రాజ రాజ చోర సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీ విష్ణు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా చూసి నవ్వలేక ప్రేక్షకుల మాస్కులు ఊడిపోతాయని చెప్పారు శ్రీ విష్ణు. ఎందుకైనా మంచిది ఇంటర్వెల్ కు ముందు మూడు మాస్కులు, ఆ తరువాత ఆరు మాస్కులు పెట్టుకొండి అని సూచించాడు. ముందు నవ్వలేక, ఆ తరువాత సెంటిమెంట్ తో ఏడ్వలేక మాస్కులు ఊడిపోతాయని శ్రీ విష్ణు చెప్పుకొచ్చాడు.
ఐతే శ్రీ విష్ణు మాస్కులపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియలో ట్రోలింగ్ జరుగుతుంది. కేవలం మాస్కులు మాత్రమే సరిపోతాయా, లేక ఇంకా ఏదైనా ఎక్స్ ట్రా తెచ్చుకోవాలా.. అంటూ నెటినజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు ఎవరి సినిమాను వాళ్లు పొగుడుకోవడంలో తప్పేం లేదని, సినిమా వాళ్లకు ఇది కమామనే అని కూడా అంటున్నారు.