ఫిల్మ్ డెస్క్- ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మా రాజశేఖర్ తెలుసు కదా. ఆయన కేవలం డ్యాన్స్ డైరెక్టర్ మాత్రమే కాదు, పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇక పలు డ్యాన్స్ షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరించారు. అమ్మ రాజశేఖర్ ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు, ఉన్నది ఉన్నట్లు చెబుతారనే పేరు ఉంది.
ఈ మధ్య బిగ్ బాస్ రియాల్టీ షోలో అమ్మ రాజ శేఖర్ తన కుటుంబం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అమ్మా, నాన్న, భార్య ఇలా అందరి గురించీ చెప్పుకొచ్చాడు. అప్పట్లో తాను ఎంత బిజీగా ఉండేవాడో, ఫ్యామిలీకి దూరంగా ఎలా ఉన్నాడో చెప్పుకుని కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఆయన తన భార్యతో కలిసి ఇస్మార్ట్ జోడి సీజన్ 2 లో పాల్గొంటున్నారు.
ఇస్మార్ట్ జోడీలో ఈ వారం వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఎపిసోడ్ షూట్ చేశారు. ఈ క్రమంలో జంటల మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని వెలికి తీసే థీమ్ను సెట్ చేశాడు హోస్ట్ ఓంకార్. ఈ క్రమంలోనే అమ్మ రాజశేఖర్ భార్య చాలా ఎమోషనల్ అయింది. భార్యలకు భర్తలు ప్రేమ లేఖలు రాయాలనే రౌండ్ భలే సరదాగా జరిగింది. ఈ రౌండ్ లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ ప్రేమను చూపించారు. భార్యల మీద ప్రేమను చాటేందుకు భర్తలు ఏకంగా కవిత్వాలు రాసేశారు.
అయితే అమ్మ రాజశేఖర్ భార్య బాగా ఏడ్చేసింది. తన లైఫ్ లో ఇలా ప్రేమలు అనేవి లేవని, లైఫ్ అంతా కూడా సర్దుకుపోవడంతోనే సరిపోయిందని ఆవేధన వ్యక్తం చేసింది. లవ్వూ గివ్వూ ఏం లేదని, వాలెంటైన్స్ డే అంటే నేను కూడా చాలా ఊహించేదాన్నని, ఏదో ఒకటి ఇస్తారు చేస్తారు అని చూసేదాన్నని చెప్పుకొచ్చింది. బెలూన్స్, కేక్స్, రొమాన్స్ అనేదే నా లైఫ్లో లేదు అంటూ బోరున ఏడ్చింది అమ్మ రాజశేఖర్ భార్య.
Celebrating Beautiful moments of love through made for each other theme in ishmart jodi#IshmartJodi2 Sat & Sunday at 9:00 pm on #Starmaa
.#SundayFunday #Beమాsked pic.twitter.com/hDrB6nUuqJ— starmaa (@StarMaa) February 7, 2022