ఫ్లాష్ న్యూస్ : పంజాబ్లోని పాటియాలా జిల్లాలో పట్టుబడిన దొంగ వధువు తన తల్లితో కలిసి మాటల్లో దింపి అవివాహితులను.. భార్యలను వదిలేసిన వారిని పెళ్లి చేసుకోవడం అలవాటుగా చేసుకుంది. గుడిలోనో లేదా మరోచోటనో సింపుల్ గా పెళ్లి చేసుకుని వారితో కాపురం మొదలుపెడుతుంది. పెళ్లయిన పది రోజులకు ఆమె సరికొత్త నాటకానికి తెర తీస్తుంది. ఏదో ఒక వంకతో భర్తతో గొడవ పెట్టుకుంది. మొదట గొడవ, తర్వాత తారాస్థాయికి గొడవలు తీసుకుని వెళ్ళి అనంతరం విడాకులు కోరుతుంది. కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తుంది. ఈ భయంతో ఆమెను చేసుకున్న వారు ఎంతో కొంత డబ్బూ నగలను భరణంగా ముట్టజెప్పి వదిలించుకుంటారు. ఈ విధంగా రూ.లక్షల్లో దండుకుని ఆమె మకాం మారుస్తుంది. ఇలా ఏకంగా 8 మందిని ఆమె వివాహం చేసుకుంది. ఈమెపై గతంలో కొందరు ఫిర్యాదు చేశారు.
9వ పెళ్లి చేసుకోబోతుండగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఆ పెళ్లిని నిలిపివేసి స్టేషన్కు తరలించారు. ఈ సమయంలో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా హెచ్ఐవీ ఎయిడ్స్ సోకిందని నిర్ధారణ అయ్యింది. ఆమె ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన 8 మంది భర్తలు ఈ విషయం తెలుసుకుని ఆందోళనకి గురయ్యారు. హెచ్ఐవీ ఎయిడ్స్ తమకు ఎక్కడ సోకిందేమోనని ఆ మాజీ భర్తలు ఆందోళన చెందుతున్నారు. వారికి కూడా పోలీసులు హెచ్ఐవీ పరీక్షలు చేయించబోతున్నారు.
కేసు దర్యాప్తులో ఉంది … మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.