65 ఏళ్లు పైబడిన వారికి గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్ర మంత్రి. ఆయన ప్రకటనతో రాష్ట్రంలోని వృద్దులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆయన చేసిన ప్రకటన ఏంటంటే?
రాష్ట్రంలోని 65 ఏళ్లు పైబడిన వారికి గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి రామలింగా రెడ్డి. ఇటీవల ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం బసవన గుడి ఆలయంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియతో మాట్లాడుతూ 65 ఏళ్లు పైబడిన వారికి శుభవార్త చెప్పారు. అసలు మంత్రి చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటి? ఇంతకు ఇది ఏ రాష్ట్రంలో అనే పూర్తి వివరాలు మీ కోసం.
కర్ణాటక మంత్రి రామలింగా రెడ్డి శనివారం బసవన గుడి ఆలయంలో పాల్గొన్నారు. అనంతరం ఆ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ 65 ఏళ్ల పైడిన వారికి గుడ్ న్యూస్ చెప్పారు. 65 ఏళ్ల పైడిన వారంతా తమ గుర్తింపు కార్డును చూపించి నేరుగా ఆలయ దర్శనానికి వెళ్లొచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ కేటగిరిలో 205, బీ కేటగిరిలో 193 దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తాయని, ఈ ఆలయాల్లో ఈ తాజా నిబంధలను వర్తిస్తాయని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ఏ,బీ కేటగిరిలో ఉన్న దేవాలయాల దర్శనానికి వస్తున్న 65 ఏళ్లు పైబడి వృద్ధులు దర్శనంలో భాగంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ఆయన నిర్ణయంతో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.