పట్నా- ఢిల్లీ మధ్య తిరిగే తేజస్ ఎక్స్ప్రెస్లో ఓ వ్యక్తి బన్నీ, అండర్వేర్తో తీరిగుతూ కనిపించాడు. ఆ బోగీలో ఉన్న మహిళలు, మిగిలిన ప్రయాణికులు అభ్యంతరం చెప్పారు. దానికి ప్రతిగా తాను చేసిన తప్పును గ్రహించకపోగా.. తిరిగి వారినే తిట్టడం మొదలెట్టాడు. అలా చేసింది ఏ మతిస్థిమితం లేనివాడో, చిన్నపిల్లాడో కాదు.. బిహార్ అధికార పార్టీ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్.
ఎమ్మెల్యే గోపాల్ మండల్ అలా తిరగడంపై బోగీలోని తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభ్యంతరం తెలిపిన ప్రయాణికులను గోపాల్ మండల్ దుర్భాషలాడారని, కాల్చేస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపించారు. అదే విషయంపై గోపాల్ మండల్ స్పందిస్తూ ‘నాకు కడుపులో ఇబ్బందిగా ఉంది. మోషన్స్ అవుతున్నాయి. అప్పటికే చాలాసార్లు టాయిలెట్కి వెళ్లాను. ప్రతిసారి నా పైజామా విప్పాలి అంటే కష్టం కదా. ఈలోపో మోషన్ అయితే ఏంటి పరిస్థితి అందుకే అలా వెళ్లాను. ఆ బోగీలో మహిళలు ఎవరూ లేరు. నన్ను ఓ కుర్రాడు అడ్డగించాడు అతను మద్యం తాగి ఉన్నాడంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. కారణం ఏదైనా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఫొటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.