కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి వెల్లడించారు. దాంతో దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సోషలిస్టు నేతగా, జేడీయూకు అధ్యక్షుడిగా ఎంతో సేవ చేశారు శరద్ యాదవ్. […]
పట్నా- ఢిల్లీ మధ్య తిరిగే తేజస్ ఎక్స్ప్రెస్లో ఓ వ్యక్తి బన్నీ, అండర్వేర్తో తీరిగుతూ కనిపించాడు. ఆ బోగీలో ఉన్న మహిళలు, మిగిలిన ప్రయాణికులు అభ్యంతరం చెప్పారు. దానికి ప్రతిగా తాను చేసిన తప్పును గ్రహించకపోగా.. తిరిగి వారినే తిట్టడం మొదలెట్టాడు. అలా చేసింది ఏ మతిస్థిమితం లేనివాడో, చిన్నపిల్లాడో కాదు.. బిహార్ అధికార పార్టీ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్. ఎమ్మెల్యే గోపాల్ మండల్ అలా తిరగడంపై బోగీలోని తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. […]