ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్య్కూట్, రసాయనాలు, టపాసులు పేలుడు, ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో కుమారుడితో సహా దంపతులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మైసూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్య్కూట్, రసాయనాలు, టపాసులు పేలుడు, ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో కుమారుడితో సహా దంపతులు ప్రాణాలు కోల్పోయారు. అలానే ఖమ్మం జిల్లాలో గ్యాస్ పేలుడు ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. టపాసుల పరిశ్రమలో నల్లమందు పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది.
కర్ణాటక రాష్ట్రం మైసూర్ లోని భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ టపాసుల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలోని టపాసులు పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. అలానే భారీ శబ్దం రావడంతో స్థానిక జనం భయంతో పరుగులు తీశారు. టపాసుల పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతుంటడంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్ముకుంది. పేలుడు సమయం లో ఇళ్లలో ఉన్నవారు ఏదో బాంబులు పేలుడు సంభవించిందని భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురికి గాయలైనట్లు సమాచారం. అయితే ఈ పేలుడు ఘటన సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.