జీవితం ఒక నీటి బుడగ లాంటిది అంటారు. ఎందుకంటే మనిషి ప్రాణం ఏ క్షణానైనా పోవచ్చు. కానీ.., మనం మాత్రం ఈ నిజాన్ని అర్ధం చేసుకోకుండా బంధాలు, బంధుత్వాల మధ్య నలుగుతూ అనుక్షణం బ్రతుకుపై ఆశలు పెంచుకుంటూ ఉంటాము. కానీ.., మీరే చెప్పండి చావుని తప్పించుకోవడం ఎవరి తరమైనా అవుతుందా? అదృష్టం బాగుంటే డెత్ ని జస్ట్ పోస్ట్ పోన్ చేసుకోగలము. తాజాగా.. ఓ అదృతవంతుడు మాత్రం ఇలాగే చావుల అంచుల వరకు వెళ్లి కొద్దిలో ప్రాణాలను కాపాడుకున్నాడు.
ఆ వివరాల్లోకి వెళ్తే.., ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద తాజాగా ట్విట్టర్ లో ఓ వీడియోని పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి బాత్రూమ్ నుంచి ప్రాణ భయంతో పరుగెత్తుకుంటూ వస్తాడు. ఆ క్రమంలో ఇంట్లోని వస్తువులను ఢీకొని పట్టుతప్పి కిందపడిపోతాడు. అయినప్పటికీ క్షణాల్లోనే మళ్లీ పైకి లేకి బయటకు పరుగులు తీస్తాడు. అతను బయటకు పరుగులు తీస్తుండగానే.., ఊహించని రీతిలో అతని పైకి భారీ చిరుతపులి దూకుతుంది. అతను లేచి పారిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే అక్కడే ఆ పులికి ఆహారం అయిపోయేవాడు.
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందకి ఇలాంటి కేసులు చాలా తగులుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు ఆయనకి సర్వ సాధారణం. ఈ నేపథ్యంలోనే ఈ వీడియో సుశాంత్ నంద చేతికి అందింది. 10 సెకండ్ల నిడివి ఉన్న ఈ స్లో మోహన్ వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల మంది ఈ వీడియోని వీక్షించారు. పులి తనని వేటాడుతున్నా.., దైర్యం కోల్పోకుండా, సమయస్పూర్తితో వ్యవహారించి ప్రాణాలను దక్కించుకున్న ఆ యువకుడిని నెటిజన్స్ అంతా మెచ్చుకుంటున్నారు. మరి గుండెలను వణికించే ఈ వీడియోని మీరు కూడా ఓసారి చూసేయండి.
That was close pic.twitter.com/sSQHpcEXlP
— Susanta Nanda IFS (@susantananda3) June 24, 2021