Krishnam Raju: టాలీవుడ్ నట దిగ్గజం కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. జనం పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. కన్నీటితో కృష్ణంరాజుకు వీడ్కోలు పలికారు. అంత్యక్రియల అనంతరం కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి మీడియా ముందు మాట్లాడారు. వెళుతున్న కారులోంచి మీడియా ముందు స్పందిస్తూ.. ‘‘ ఆయన ఎక్కడికీ వెళ్లలేదు. పెద్దనాన్నగారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఎలా కోరుకున్నారో అలానే జరిగింది’’ అని అన్నారు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు.
కాగా, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణం అనంతరం ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఇంటి వద్ద ఉంచారు. సినీ,రాజకీయ ప్రముఖులు, సామాన్య జనం భారీగా ఆయన చివరి చూపుకు తరలి వచ్చారు. తమ సంతాపాలను తెలియజేశారు. చిరంజీవి, మోహన్బాబు, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, తివిక్రమ్ తదితరులు కృష్ణంరాజు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇక, కృష్ణంరాజు మొదటి భార్య సీతా దేవి 1995లో కారు ప్రమాదంలో కన్నుమూశారు. 1996లో కృష్ణంరాజు శ్యామలా దేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రభాస్, కృష్ణంరాజు తమ్ముడైన యూవీ సూర్యనారాయణరాజు కుమారుడు. ప్రభాస్ సొంత కుమారుడు కాకపోయినా కృష్ణంరాజు సొంత కొడుకుకంటే ఎక్కువగా చూసుకున్నారు. మరి, కృష్ణంరాజు, శ్యామలా దేవి అనుబంధంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Krishnam Raju: కృష్ణంరాజు పార్థివదేహంపై వెక్కివెక్కి ఏడ్చిన శ్యామలా దేవి!