నీరజ్ చోప్రా.. ఇప్పుడు దేశం అంతా జపిస్తున్న ఒకే ఒక్క పేరు ఇది. టోక్యో ఒలింపిక్స్లో భారత్ తరఫున జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఈ హరియాణా కుర్రాడు. దీంతో.., ఇప్పుడు నీరజ్ చోప్రా బయోపిక్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కానీ.., ఇప్పుడు నీరజ్ చోప్రా వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. అతను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అతనిలో అంతటి టాలెంట్ కూడా ఉంది. దీంతో.., ఇప్పట్లో నీరజ్ చోప్రా బయోపిక్ తెరకెక్కే అవకాశాలు కనిపించడం లేదు. అయితే.., నీరజ్ బయోపిక్ పై ఎలాగో చర్చ మొదలైంది కాబట్టి.., ఇప్పుడు ఈ బయోపిక్ లో హీరో ఎవరైతే బాగుంటుందన్న చర్చ నడుస్తోంది.
నెటిజన్స్ మాత్రం బాహుబలి ప్రభాస్ అయితే.., బయోపిక్ కి సరిగ్గా సరిపోతాడంటూ సూచిస్తున్నారు. మరికొంత మంది మాత్రం రణవీర్ సింగ్ అయితే బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ బాబు పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. కానీ.., తన బయోపిక్ పై మూడేళ్ళ క్రితం నీరజ్ చోప్రా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
2018లో ఆసియా క్రీడల్లో కూడా నీరజ్ గొప్పగా రాణించాడు. ఆ సమయంలో కూడా నీరజ్ బయోపిక్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. నా బయోపిక్ లో రణ్దీప్ హుడా గాని, అక్షయ్ కుమార్ గాని నటిస్తే బాగుంటుందంటూ చెప్పుకొచ్చాడు. అయితే.., దేశం అంతా రిసీవ్ చేసుకునేంత స్టార్డమ్ రణ్దీప్ హుడాకి ఇప్పుడు లేదు. నీరజ్ చోప్రా బయోపిక్ లో అక్షయ్ కుమార్ అయితే అద్భుతంగా నటించగలడు. కానీ.., అతని వయసు ఎక్కువై పోతుంది. దీంతో.., మన బాహుబలి ప్రభాస్ గనుక బల్లెం చేతబట్టి.., నీరజ్ చోప్రా బయోపిక్ లో నటిస్తే, బొమ్మ అదిరిపోవడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. మరి.., నీరజ్ చోప్రా బయోపిక్ లో ఏ హీరో నటిస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.