ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత ప్రతినిధి రచితా గట్టి సమాధానం ఇచ్చారు. ఆయనకు అందరి ముందు గుర్తుండిపోయే సమాధానం చెప్పారు. దీంతో పాకిస్తాన్కు పరువు తీసుకున్నట్లు అయింది.
‘చింత చచ్చినా పులుపు చావదు’ అన్నట్లుగా దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి తయారైంది. ఆర్థిక సంక్షోభంతో తిండికి లేక జనాలు అల్లాడుతున్నా.. కశ్మీర్ విషయంలో అనవసరపు ఆరోపణలు చేయటం మానటం లేదు. తాజాగా, ఐక్యరాజ్య సమితిలోనూ కశ్మీర్ విషయం గురించి పాక్ ప్రస్తావించి భంగపాటుకు గురైంది. భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. మంగళవారం ఐక్య రాజ్య సమితిలోని భద్రతా మండలి.. మహిళలు, శాంతి భద్రతలపై డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్లో వివిధ దేశాల ప్రతినిధులతో పాటు ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్..
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్దారీ పాల్గొన్నారు. డిబేట్ సందర్భంగా బిలావల్ బుట్టో కశ్మీర్ ప్రస్తావన తెచ్చారు. భారత్ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. దీనికి రుచితా కాంబోజ్ గట్టి సమాధానం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ ‘‘ నా ప్రసంగాన్ని ముగించే ముందు నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. నేను పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను. అవి నిరాధారమైనవి. రాజకీయ స్వార్థం కోసం చేస్తున్నవి. అలాంటి విష, తప్పుడు ప్రచారంపై స్పందించటం కూడా వృధానే.
ఈ రోజు మనం మహిళలు, శాంతి, భద్రతల కోసం ఈ చర్చను ఏర్పాటు చేశాము. మనం డిబేట్ పెట్టిన అంశాన్ని గౌరవించాలి. సమయం ప్రాధాన్యతను గుర్తించాలి. మన దృష్టి మొత్తం అంశం మీదే ఉండాలి. జమ్మూ కశ్మీర్, లడఖ్లు భారత్లోనే ఉన్నాయి. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటీకి అవి మా అంతర్భాగమే. గతంలో పలుసార్లు పాకిస్థాన్కు చెప్పాం. పొరుగు దేశంగా పాకిస్థాన్తో సాధారణ సంబంధాలను భారత్ కోరుకుంటోంది’’ అని అన్నారు. ఐరాసలో పాక్కు భారత్ గడ్డిపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.