సామాన్యంగా అప్పుడప్పుడు అడవుల్లో జీవించాల్సిన ప్రమాదకర విషసర్పాలు పంటపొలాల్లో, జనావాసాల్లో దర్శనమిచ్చి బెంబేలెత్తిస్తుంటాయి. అలాంటి వాటిలో పెద్ద పెద్ద కొండచిలువలు కూడా ఉంటాయి. వీటి కారణంగా కొన్నిసార్లు అమాయక జనాలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూసాం. తాజాగా ఓ మిర్చితోటలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైన ఘటన.. కర్నూల్ జిల్లా గోస్పాడు మండలంలో చోటుచేసుకుంది.
పొలంలో పనిచేసుకుంటున్న రైతు, అతని కూలీలు కొండచిలువను పరుగులు తీశారు. గోస్పాడు మండలం, పసురపాడు గ్రామ సమీపంలో ఈ భారీ కొండచిలువ హల్చల్ చేసింది. స్థానికులు స్పందించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో.. హుటాహుటిన అధికారులు అక్కడికి చేరుకొని బంధించారు. అనంతరం ఆ 10 అడుగుల పైగా పొడవు కలిగిన కొండచిలువను మహానంది సమీప అడవిలో వదిలేసారు. భారీ ప్రాణాపాయం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పీలికలు కొండచిలువను చాకచక్యంగా బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు వీడియో పై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రుపంలో తెలియజేయవచ్చు.