హైదరాబాద్- కరోనా చాలా రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలు అస్తవ్యస్తం అయ్యాయి. భారత్ లాంటి మన దేశంలో జన జీవనం స్తంభించి పోయింది. సామాన్యులు మాత్రమే కాదు, ప్రభుత్వాలు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. కరోనతో ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయంలో పడ్డాయి. ఇప్పుడు కరోనా చేపల మందు పంపిణీ పై కూడా ప్రభావం చూపుతోంది. కరోనా తో చేపల మందు ఆగిపోయింది. హైదరాబాద్ నగరంలో ప్రతి యేటా బత్తిని సోదరులు ఉబ్బసం రోగులకు చేపల మందును పంపిణీ చేస్తుంటారు. కానీ ఈసారి చేపల మందు ప్రసాదానికి బ్రేక్ పడింది.