ఈటల రాజేందర్.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో.., ఆ మాటకొస్తే రెండు తెలుసు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. నిన్ని మొన్నటి వరకు ఈయన టి.ఆర్.ఎస్. పార్టీలో మెయిన్ లీడర్. ఉద్యమ సమయంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, తెలంగాణ ప్రజానీకాన్ని పోరుబాటలోకి తీసుకొని రావడంలో రాజేందర్ పాత్ర ప్రత్యేకం. ఇక టి.ఆర్.ఎస్. అధికారంలోకి వచ్చాక కూడా ఆయనకి పార్టీలో సముచిత స్థానమే దక్కింది. కానీ.., తరువాత కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసీఆర్-ఈటల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. తరువాత ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడం, తరువాత ఆయన్ని మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడం, బయటకి వచ్చిన ఈటల బీజేపీ కండువా కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. అక్రమాస్తులు కూడగట్టారు, ప్రభుత్వ భూములు కబ్జా చేశారంటూ టి.ఆర్.ఎస్. లీడర్లు ఎన్నిసార్లు ఆర్థికపర ఆరోపణలు చేసినా ఈటల రాజేందర్ ఈ విషయంలో లోతుగా స్పందించింది లేదు. అయితే.., ఇప్పుడు మొదటిసారి ఈ విషయంలో ఈటల సంచలన కామెంట్స్ చేశాడు.
సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ “బ్లాక్ & వైట్ విత్ జాఫర్” పోగ్రామ్ లో సీనియర్ జర్నలిస్ట్ జాఫర్.. ఈటల రాజేందర్ ని సూటిగా ఇదే ప్రశ్న అడిగారు. మీరు భూములు కబ్జా చేయలేదా? వేల కోట్ల ఆస్తులు సంపాదించలేదా అంటూ.. జాఫర్ తనదైన స్టయిల్ లో ప్రశ్నలు కురిపించాడు. దీనికి.. ఈటల కూడా అంతే స్థాయిలో స్పందించారు. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, మారుమూల పల్లెలోనైనా, ఎలాంటి భూమైనా ఒక్క ఎకరం ఆక్రమించినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని మా సంస్థల యజమాని నా సతీమణి చెప్పింది. పార్టీలో చేరినప్పుడు నా ఆస్తులు, ఇప్పుడు ఈటల రాజేందర్ ఆస్తులు ఎన్ని, అప్పుడు కేసీఆర్ ఆస్తులు ఎంత, ప్రస్తుతం కేసీఆర్ ఆస్తుల లెక్క ఎంత విచారణ జరిపించండి అంటూ ఈటల రాజేందర్ బహిరంగా సవాలు విసిరారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఈ ఇంటర్వ్యూని చూసి.., దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.