స్పెషల్ డెస్క్- రాజమౌళి.. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేేదు. భారత దేశ సినీ పరిశ్రమలో రాజమౌళికి ప్రత్యేక స్థానం ఉంది. బాహుబలి సినిమాతో రాజమౌళి ప్రపంపవ్యాప్తంగా ప్రసిద్దిగాంచారు. ఇక ఈ దర్శకధీరుడు మామూలుగానే వివాదాల జోలికి వెళ్లరు. తన సినిమాలేవో తాను తీసుకుంటూ కూల్ గా తన పనిలో మునిగిపోతారు. ఐతే ఈ సారి మాత్రం రాజమౌళికి కోపం వచ్చింది. తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వార వెలిబుచ్చారు రాజమౌళి.
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోని పరిస్థితులపై రాజమౌళి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ విమాన సంస్థ లుఫ్తాన్సా ప్లయిట్ ద్వారా ఢిల్లీ ఎయిర్ పోర్టులోకి వచ్చినప్పుడు ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం ప్రయాణీకులకు పత్రాలను అందించారు. అయితే ఆ పత్రాలను నింపడానికి ఏమాత్రం సౌకర్యాలు కల్పించలేదని ఆయన మండిపడ్డారు. ప్రయాణీకులు కొందరు నేలపై కూర్చుని, మరికొందరు గోడపై పత్రాలను ఉంచి నింపారని రాజమౌళఇ చెప్పుకొచ్చారు. పత్రాలు నింపడానికి కనీసం టేబుల్స్ను ఏర్పాటు చేయడం అనేది చాలా సాధారణ సర్వీస్ అని, దాన్ని అందించాల్సిందని ఆయన అన్నారు.
అంతే కాదు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వెలుపల ద్వారం వద్ద ఉండే హ్యాంగర్ దగ్గర వీధి కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయని రాజమౌళి చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి సన్నివేశాలను చూసినప్పుడు విదేశీయులకు మనదేశంపై కలిగే మొదటి అభిప్రాయం మరోలా ఉంటుందని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ విషయంపై దృష్టి సారించండి.. ధన్యవాదాలు.. అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఏ మేరకు రాజమౌళి చేసిన వ్యక్తం చేసిన అసంతృప్తి, చేసిన సూచనలపై ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వర్గాలు స్పందిస్తాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Dear @DelhiAirport,
arrived at 1 AM by lufthanasa flight. Forms were given to fill for the RT PcR test. All the passenges are sitting on the floors or propping against the walls to fill the forms. Not a pretty sight. Providing tables is a simple service.— rajamouli ss (@ssrajamouli) July 2, 2021