అమరావతి- కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఔషధానికి ఎట్టకేలకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు కాసేపటి క్రితం దగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే కంట్లో వేసే చుక్కల మందుకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ రకాల మందులకు ఓకే చెప్పిన ప్రభుత్వం, కంట్లో వేసే కె అనే మందు అనుమతి మాత్రం పెండింగ్ లో పెట్టింది. ఆనందయ్య మందులపై సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐతే కంట్లో వేసు మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉంది.
ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎటువంటి హాని లేదని సీసీఆర్ఏఎస్ నివేదికలో తేలిందట. ఐతే అలాగనీ ఆనందయ్య మందు వాడితే కోవిడ్ తగ్గుతుంది అనడానికి ఎలాంటి నిర్ధారణలు లేవని ఈ నివేధిక తేల్చి చెప్పింది. అంతే కాదు ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ, ఎవరి ఇష్టాను సారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని జగన్ సర్కార్ సూచించింది. ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కరోనా రోగులకు బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.. కోవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందన్న రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆనందయ్య కరోనా మందు పంపిణీ సందర్భంలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావడానికి మరో 2 నుంచి 3 వారాల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మొత్తానికి చాలా రోజులుగా ఆనందయ్య ఔషధం కోసం ఎదురు చూస్తున్న కరోనా రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.