ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన మాటలు, అందాలు, హోయలతో ప్రేక్షకులను అలరిస్తోంది అనసూయ. ఇక టీవీ షోలు, సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలోను అనసూయ హాగా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీకి సంబందించిన చాలా విషయాలను సోషల్ మీడియా ద్వార అభిమానులతో పంచుకుంటుందీ జబర్దస్త్ బ్యూటీ.
హైదరాబాద్లో ఎడతెరపి లేకుండా గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంపై స్పందించింది అనసూయ. కారులో హాయిగా షికార్లు కొడుతున్న ఫొటోను జత చేయడంతో పాటు కవిత్వం కూడా చెప్పింది. ఐతే తన సొంత కవిత్వం కాదనుకొండి. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతరామ శాస్త్రి రాసిన పాటలోని చరణాలను అనసూయ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
”చిన్ననాటి తాయిలంలా… నిన్ను నాలో దాచుకోనా… కన్నెయీటీ సోయగంలా… నన్ను నీలో పోల్చుకోనా… పెదవులు పాడేకిలకిలలోన… పదములు ఆడే కథకళిలోన… కనులను తడిపే కలతలలోన… నా అణువణువున నువు కనిపించేలా… నువ్వొస్తానంటే నేనొద్దంటాన… వాన” అంటూ కవిత్వం పోస్ట్ చేసింది అనసూయ.
అంతే కాదు ఆమె.. రెయిన్ లవర్.. అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేసింది. ఇంకేముంది అనసూయ హొయలుపోతూ వానపై పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్లు అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా పుష్ప లో కీలక పాత్రలో నటిస్తోంది.