వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ కొంత కాలం తరువాత కనుమరుగు అవ్వడం సహజమే. అయితే ఆతరవాత కూడా వారు అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. వయసు పై బడుతున్న కొద్ది వారు వదిన, అమ్మ, భార్య క్యారెక్టర్లు చేస్తూంటారు. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో వారిని సోషల్ మీడియా ప్రేక్షకుల దగ్గరికి తీసుకుపోతోంది. అలా వారు తమ ఫ్యామీలీ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను పలకరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే నటి స్నేహ తన పిల్లలతో దిగిన పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
స్నేహ.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటిస్తోంది. అయితే తాజాగా తన కొడుకు విహాన్ 7వ పుట్టిన రోజు సందర్భంగా పిల్లలతో దిగిన పిక్స్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
స్నేహ దంపతులు పిల్లల విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటారని సన్నిహితులు చెబుతుంటారు. ఈ క్రమంలో తన కొడుకు విహాన్ పుట్టిన రోజు సందర్భంగా స్విమ్మింగ్ పూల్ లో దిగిన పిక్ షేర్ చేసి.. ” పుట్టిన రోజు శుభాకాంక్షలు లడ్డు.. నువ్వు నాకు 7 సంవత్సరాల నుంచి సంతోషాన్ని, ప్రేమను అందిస్తున్నావు. ప్రతి తల్లిదండ్రులు కోరుకునే కొడుకువు నువ్వు.. నీపై నా ప్రేమను వర్ణించడానికి నాదగ్గర పదాలు లేవు.. హ్యాపీ బర్త్ డే విహాన్ తంగమ్” అంటూ రాసుకొచ్చింది.
ఇక స్నేహ- ప్రసన్న జంట సుమారు 10 సంవత్సరాల క్రితం అచ్చముండు.. అచ్చముండు చిత్రంలో కలిసి నటించారు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వివాహ బంధంతో ఒకటైయ్యారు. ఈ దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మరి స్నేహ అందమైన ఫ్యామీలీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.