ఇంటర్నేషనల్ డెస్క్- బాంగ్లాదేశ్ స్టార్ హీరోయిన్ పోరి మోని డ్రగ్స్ రాకెట్ కేసులో చిక్కుకుని ప్రస్తుత విచారణ ఎదుర్కొంటోంది. ఆగస్టు 5న బంగ్లా యాంటీ టెర్రర్ స్క్వాడ్ మోనీ ఇంటి మీద దాడులు చేసి నాలుగు గంటలపాటు సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు దొరికినట్లుగా ప్రకటించిన అధికారులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోరీ మోనీ ఇంట్లో భారీగా డ్రగ్స్, విదేశీ మద్యం పట్టుబడింది.
ఈ కేసుకు సంబందించిన రాపిడ్ యాక్షన్ బెటాలియన్ బరిలోకి దిగి పోరి మోని ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతోంది. ఇక ఈ కేసు విచారణ సందర్బంగా పోరి మోనికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగలోకి వస్తున్నాయి. ఆమెకు పోర్నోగ్రఫీ వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలే టార్గెట్గా ఈ రాకెట్ నడిపినట్లు చెప్పుకొచ్చింది.
సంపన్నుల పిల్లలకు అందమైన అమ్మాయిలను ఎర వేసి పోరి మోని కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు పోలీసుల విచారణలో పేర్కొంది. పోరి మోని ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో విదేశీ మద్యం, డ్రగ్స్తో పాటు ఓ పోర్నోగ్రఫీ సీడీ కూడా దొరకింది. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. డబ్బున్న నేతలకు, సంపన్నుల పిల్లలకు అమ్మాయిలతో వలపు వల వేసి ఆమె కోట్లాది రూపాయలు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ కేసుతో పాటు పోర్నోగ్రఫీ వ్యవహారం బయటపడటంతో ఇప్పడీ కేసు బంగ్లాదేశ్ లో సంచలనంగా మారింది. ఇక ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని. ఇదంతా కావాలని తనను ఇరికించాలని చేస్తున్న కుట్ర అని పోరి మోని చెప్పడం కొసమెరుపు.