వెండితెర రారాజు, రెబల్ స్టార్ కృష్ణం రాజు(83) ఇవాళ తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్ను మూశారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కృష్ణం రాజు ఇక లేరన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణం రాజు మరణం పట్ల సినీ,రాజకీయ ప్రముఖులు చింతిస్తున్నారు. కృష్ణం రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కి తరలించి.. అక్కడి నుంచి మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నెల రోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కృష్ణం రాజుని.. ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్స్ లో ఒకటైన ఏఐజీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో చేర్చారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉంది ఈ హాస్పిటల్. ఇక కృష్ణం రాజు మరణానికి కారణం పోస్ట్ కోవిడ్ సమస్య అని తెలుస్తోంది. కృష్ణంరాజు గత కొంత కాలంగా పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏఐజీ హాస్పిటల్ లో చేరారు. అయితే పోస్ట్ కోవిడ్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినట్లు తెలుస్తోంది. పోస్ట్ కోవిడ్ తర్వాత అనేక మంది సెలబ్రిటీలు మృత్యువాత పడ్డారు. ప్రముఖుల మరణాల వెనుక పోస్ట్ కోవిడ్ అనేది ఉండడం మనం గతంలో చూశాం.
పోస్ట్ కోవిడ్ తర్వాత గుండె సమస్యలు అధికమవుతాయని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. గుండె సమస్యతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా అనేక మంది పోస్ట్ కోవిడ్ సమస్యతో మృత్యువాత పడ్డారు. తాజాగా కృష్ణం రాజు కూడా పోస్ట్ కోవిడ్ సమస్యతో మృత్యువాత పడ్డారు. దీంతో ఆయన ఇతర అనారోగ్య సమస్యల కారణంగా, ముఖ్యంగా గుండె సమస్యతో మరణించినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కృష్ణం రాజు స్థానం భర్తీ చేయలేనిది. ఆయన తిరిగి రారన్న వార్త ఇండస్ట్రీలో అందరినీ కలచివేస్తోంది. కృష్ణం రాజుకి సద్గతులు ప్రాప్టించాలని భగవంతుడ్ని కోరుకుందాం. ఓం శాంతి.
ఇది చదవండి: కృష్ణంరాజు మరణవార్త తెలియగానే ఆసుపత్రికి చేరుకున్న అనుష్క!