విశ్వక్ సేన్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యాడని చెప్పొచ్చు. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో చెయ్యాల్సిన సినిమా విషయంలో చెలరేగిన వివాదాన్ని సారీ చెప్పి సద్దుమణిగేలా చేశాడు.
విశ్వక్ సేన్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యాడని చెప్పొచ్చు. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో చెయ్యాల్సిన సినిమా విషయంలో చెలరేగిన వివాదాన్ని సారీ చెప్పి సద్దుమణిగేలా చేశాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ.. తనను తాను నిరూపించుకునేందుకు బాగా కష్టపడ్డాడు. తక్కువ సమయంలో మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకున్నాడు. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్ నామదాస్’, ‘హిట్’, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సినీ ఇండస్ట్రీలో తన పేరు చర్చించుకునేలా చేశాడు. అయితే తాజాగా ‘పేక మేడలు’ టీజర్ లాంచ్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యాడు. ఈ సినిమా మంచి విజయం కావాలని చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపాడు. అలాగే ఇటీవల జరిగిన ఓ కాంట్రవర్సీ గురించి మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచాడు విశ్వక్ సేన్..
‘‘సినిమా విజయం అందుకుంటే తలెత్తుకోవడంలో తప్పులేదు.. కానీ నన్ను కించపరిచినందుకే బాధగా ఉంది, ఎవరి స్థాయిని బట్టి వారు బిజీగా ఉంటారు. ఏం చెయ్యాలో క్లారీటి లేనప్పుడు ఎదుటి వాళ్ల టైమ్ వృధా చెయ్యొద్దునుకుటాం. అలాంటప్పుడు ‘కలవలేం, కథ వినలేం’ అని చెప్తుంటాం. దానికి కొంతమంది ఫీలవుతుంటారు. ఆ విషయంలో నేనేం చేయలేను. అందరినీ హ్యాపీ చేయడానికి నేను బిర్యానీ కాదు. మన సినిమా మంచిగా ఆడితే తలెత్తుకోవడంలో తప్పు లేదు. తెలుగులో ఏ సినిమా హిట్ అయినా కొందరు ఇండస్ట్రీలో పలనా సినిమా హిట్ అయ్యిందని ఏడ్చేటోల్లు ఉంటారు. చిన్న సినిమా విజయవంతంగా నడవడం అందరూ సంతోషించే విషయం. ఆ చిత్ర యూనిట్కు కంగ్రాట్స్ కూడా చెప్పాను. సినిమా ట్రైలర్ బాగుందని మొదటగా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేసింది నేనే. అయినా దర్శకుడిని నేను కలవలేందటూ మీమ్స్ వచ్చాయి. గంట విని చెప్పడం కంటే ముందే చెప్పడం బెటర్ అని నో చెప్పా’’ అంటూ ఆ దర్శకుడి పేరు ఎత్తకుండానే పరోక్షంగా చురకలంటించాడు.
ఇంతకీ ఈ కాంట్రవర్సీ ఏంటంటే?.. రీసెంట్గా విడుదలైన ఓ బ్లాక్ బస్టర్ సినిమా ప్రచారంలో భాగంగా డైరెక్టర్, తను ఆ మూవీ స్టోరీ చెప్పడానికి ఓ హీరో దగ్గరకు వెళ్తే, కలిసేందుకు కూడా టైమ్ ఇవ్వలేదని తెలిపాడు. అదే సమయంలో విశ్వక్ ట్వీట్ పెట్టడంతో వైరల్ అయ్యింది. ఆ డైరెక్టర్కి కౌంటర్ ఇచ్చేందుకు ట్వీట్ చేశాడంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ‘బాహుబలి’, ‘ఎవరికీ చెప్పొద్దు’ వంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన రాకేష్ వర్రే ‘పేక మేడలు’ సినిమాను నిర్మిస్తున్నాడు. వినోద్ కిషన్ ఈ చిత్రంతో హీరోగా మారనున్నాడు. అనూష కృష్ణ హీరోయిన్గా పరిచయం కానుంది. కొత్త డైరెక్టర్ నీలిగిరి మామిళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.