ఆర్ఆర్ఆర్, బాహుబలి, భజరంగీ భాయిజాన్.. ఈ సినిమాలన్ని ఎంత ఘన విజయం సాధించాయో అందరికి తెలిసిన విషయమే. ఇక తాజాగా విడుదలైన పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ భారీ కలెక్షన్స్ లు వసూలు చేస్తూ.. రికార్డులు తిరగరాస్తుంది. బహుబలి రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఇక విజయవంతమైన చిత్రాల దర్శకుడిగా రాజమౌళికి మంచి గుర్తింపు ఉంది. రాజమౌళి విజయంలో అధిక భాగం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్కు దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా విజయంలో ముఖ్యపాత్ర పోషించేది కథ.
బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే కథలను అందించడంలో సిద్ధ హస్తులు విజయేంద్ర ప్రసాద్. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “ఒక్కొక్క రచయితది ఒక్కొక్క శైలిలో రచన ఉంటుంది. త్రివిక్రమ్ మాటలంటే నాకు ఇష్టం. కథను చెప్పండంలో సుమకుమార్ స్టైల్ వేరేలా ఉంటుంది. ఆయనంటే నాకు గౌరవం. వీరందరు మూవీ టూ మూవీకి కథనంలో కొత్తదనం ఉంటుంది. పుష్ప సినిమా చూసి వణికిపోయాను. ఆ సినిమా నన్ను బాగా ఆకట్టుంది”అని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.