నటి నిత్యామీనన్ ఇంట్లో ఈ రోజు ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది నిత్యా. దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. తన అందంతో మైమరిపించే ఎక్స్ ప్రెషెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. సినిమాల్లో గ్లామర్ షో చేయకుండానే స్టార్ డమ్ సాధించుకుంది. తెలుగులో అలా మొదలైంది సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్ తో వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, జనతా గ్యారేజ్ సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అగ్రహీరోల సరసన నటించే అవకాశం పొందింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా బీమ్లా నాయక్ సినిమాలో అలరించింది నిత్యామీనన్.
కాగా హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తనకు అత్యంత ఇష్టమైన తన అమ్మమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. ఆదివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలిపింది. దీంతో తీవ్ర దుఖంలో మునిగి పోయింది నిత్యామీనన్. ఈ విషాద ఘటనను నిత్యామీనన్ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసి భావోద్వేగానికి గురైంది. గతంలో తన అమ్మమ్మ తాతయ్య తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ఒక శకం ముగిసింది. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్. మరో లోకంలో కలుద్దాం అంటూ ఎమోషనల్ గా ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చింది. కాగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇది చూసిన నిత్యామీనన్ అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్ లు పెడుతున్నారు.