స్టార్స్, అభిమానుల మధ్య వారధిగా మారింది సోషల్ మీడియా. దీని వినియోగం పెరిగాక అభిమానులతో నిత్యం టచ్లో ఉంటున్నారు స్టార్లు. తమ సినిమాలు, షూటింగ్ కు సంబంధించిన విషయాలనే కాక.. వ్యక్తిగత అంశాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సోషల్ మీడియా వినియోగంలో ముందుంటాడు. తన సినిమాలకు, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. తాజాగా టైగర్ తన ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటో చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి : హీరోయిన్ రష్మికాకు ప్రమాదం! షాక్ లో ఫ్యాన్స్!
ప్రస్తుతం టైగర్ గనపథ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ యూకేలో జరుగుతుంది. ఈ క్రమంలో తన కంటికి గాయమైనట్లు తెలిపాడు టైగర్. ఇందుకు సంబంధించిన ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసి.. గణపత్ ఫైనల్ కౌంట్డౌన్ సమయంలో ఇలా జరగడం.. ఏం బాగాలేదు అనే క్యాప్షన్ తో పోస్ట్ చేశారు. ఫోటోల టైగర్ ఎడమ కన్ను చుట్టూ కందిపోయినట్లు ఉంది. ఇది చూసిన అభిమానులు.. గెట్ వెల్ సూన్ టైగర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : నీ మనసాక్షితోనైనా నిజాయితీగా ఉండు! దీప్తీ సునైనా పోస్ట్ వైరల్!
వికాస్ బహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గణపత్ సినిమాలో టైగర్ సరసన కృతి సనన్ నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 23, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.