‘బ్రహ్మస్త్రం’.. ఈ మధ్య థియేటర్స్ లోకి వచ్చిన పాన్ ఇండియా మూవీ. గ్రాఫిక్స్ ప్రధానంగా తీసిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో తెలుగు హీరో నాగార్జున కూడా ఓ పాత్రలో నటించారు. ఇక రాజమౌళి దర్శకుడు.. ఈ చిత్రానికి తెలుగులో సమర్పకులుగా వ్యవహరించారు. తెలుగులో 2వ రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి.. మూడో రోజు ఏకంగా మూడు కోట్ల లాభాల్లో చేరింది. నాగ్-రాజమౌళినే కాదు టాలీవుడ్ లో మరో హీరోకి కూడా ‘బ్రహ్మాస్త్ర’లో నటించే ఆఫర్ వచ్చింది. కానీ తనే దానిని తిరస్కరించాడట.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘సమ్మోహనం’ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో నటించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. కెరీర్ లో పలు చిత్రాలు చేసిన ఇతడు.. హిందీలోనూ ‘బాఘీ’ సినిమాలో విలన్ గా నటించాడు. తెలుగులోనే నటుడిగా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం సుధీర్ హీరోగా చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బ్రహ్మస్త్ర’ వచ్చిన ఆఫర్ గురించి బయటపెట్టాడు.
‘హిందీలో ‘బాఘీ’లో విలన్ గా చేసిన తర్వాత.. బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చాయి. కానీ నా తొలి ప్రాధాన్యం తెలుగుకే. ‘బ్రహ్మాస్త్ర’లో ఓ కీలకమైన పాత్ర కోసం నన్ను సంప్రదించారు. కానీ ఎక్కువ రోజులు షూటింగ్ కి కేటాయించాల్సి ఉంది. అదే టైములో ‘సమ్మోహనం’తో బిజీగా ఉండటం వల్ల, డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ‘బ్రహ్మస్త్ర’ని రిజెక్ట్ చేశాను’ అని సుధీర్ బాబు గతంలో జరిగిన విషయాల్ని గుర్తుచేసుకున్నారు. మరి ‘బ్రహ్మస్త్ర’లో సుధీర్ బాబుని ఏ రోల్ కోసం అడిగి ఉంటారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓ చెత్త సినిమా.. 600 కోట్లు తగలబెట్టారు: కంగనా!