సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిదం ఫేమ్ పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మే12 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను రికార్డు స్థాయిలో స్క్రీన్లలో విడుదల చేయనున్నారని సమాచారం. అయితే తాజాగా ‘సర్కారు వారి పాట’ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ టాక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కగా యూ/ఏ సర్టిఫికెట్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాల 09 సెకన్లు ఉంది. ఇందులో మహేష్ యాక్టింగ్ ఇరగదీశినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ మంచి కిక్ ఇచ్చే మూవీగా నిలుస్తోందని టాక్. సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పంచ్ డైలాగ్స్ పవర్ ఫుల్ గా పేలాయని ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూలు సాధించే చిత్రాలు లేకపోవడంతో సర్కారు వారి పాట ప్రేక్షకులకు ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. ఇప్పటికే రిలీజైన సర్కారు వారి పాట ట్రైలర్ పాజిటివ్ టాక్ తో రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కచ్చితంగా మహేష్ అభిమానులకు పుల్ మీల్స్ ను అందిస్తుందని సినీ వర్గాల అభిప్రాయం. మరి.. సర్కారు వారిపాట సెన్సర్ రివ్యూపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.