సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ RRR. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రధానపాత్రలలో నటించారు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండగా.. ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు బద్దలైపోయిన సంగతి తెలిసిందే.
ఇక తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడెప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయా? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది RRR బృందం. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మార్చి 19, 20 నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం. కానీ తెలుగు రాష్ట్రాలలో టికెట్ బుకింగ్ చేద్దామనుకుంటున్న ఫ్యాన్స్ కి బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేద్దామంటే.. హెవీ బుకింగ్స్ కారణంగా సైట్ క్రాష్ అయినట్లు వార్త వైరల్ అవుతోంది.ప్రస్తుతానికి సైట్స్ లో RRR బుకింగ్ ఆప్షన్ కనిపించడం లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే సైట్స్ కూడా త్వరగా సమస్యను పునరుద్ధరించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఓవైపు వీలైనంత త్వరగా బుకింగ్స్ స్టార్ట్ చేయాలనీ ఫ్యాన్స్ హడావిడి కూడా మాములుగా లేదు. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన పాన్ ఇండియా మూవీ కావడంతో RRR పై హైప్ కూడా భారీ స్థాయిలో నెలకొంది. మరి RRR పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.