ప్రముఖ దర్శకుడు, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక న్యూస్ తో వార్తలో నిలవాలని ఆరాటపడతాడని చాలామంది అభిప్రాయం. తాజాగా తెలుగు, కన్నడ చిత్రపరిశ్రమలపై ఆర్జీవీ వివాదస్పద ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత కొంతకాలంగా సౌత్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు విడుదలై కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ లో సైతం భారీ వసూలు సొంతం చేసుకుంటున్నాయి. బాహుబలి, బాహుబలి-2 పుష్ప, ఆర్ఆర్ఆర్ , కేజీఎఫ్-2 వంటి చిత్రాలు నార్త్ లో అద్భత విజయాలు సాధించాయి. ఎంతలా అంటే అక్కడి సినిమాల కంటే కూడా సౌత్ సినిమాలే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ క్రమంలో ఆర్జీవీ తెలుగు, కన్నడ పరిశ్రమలను బాలీవుడ్ లో కరోనాతో పోలుస్తూ ట్వీట్ చేశాడు.
తెలుగు, కన్నడ సినిమాల ప్రభావం కరోనా వైరస్ లాగా హిందీ పరిశ్రమను సోకిందని, త్వరలో బాలీవుడ్ లో వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నాను అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశాడు. దీనిపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. మరికొందరు ఏదో ఒక వార్తలో నిలవడం కోసం ఆర్జీవీ ఇలాంటి పనిలేని పోస్టులు పెడుతుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఏపీ టికెట్ల ధరల విషయంలోను, మాజీ మంత్రి కొడాలి నాని విషయంలో ఇలానే వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.మరి.. ఆర్జీవీ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
TELUGU and KANNADA films have INFECTED Hindi films like a COVID VIRUS..Hoping that BOLLYWOOD will soon come up with a VACCINE 💐
— Ram Gopal Varma (@RGVzoomin) April 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.