నందమూరి కుటుంబానికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు కుమారులు, కుమార్తెలు ప్రస్తుతం వివిధ ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇంత పేరున్న కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం తన గదిలో ఉరివేసుకుని ఆమె మరణించారు. ఈక్రమంలో ఉమామహేశ్వరి బంధువులంతా ఆమె కడసారి చూపుకోసం భారీగా తరలివచ్చారు. నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చంద్రబాబునాయుడు, భువనేశ్వరి ఉమామహేశ్వరి అంతక్రియలను దగ్గరుండి చూసుకున్నారు.
అయితే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మేనత్తను కడసారి చూసేందుకు రాలేదు. కనీసం అంత్యక్రియల సమయానికైన పాల్గొంటారాని అందరు భావించారు. కానీ ఉమామహేశ్వరి అంత్యక్రియలకు సమయానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. ప్రస్తుతం భార్య, పిల్లలతో కలిసి వెకేషన్ కి ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తారక్ రాకపోవడం పై నెటిజన్లు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాల కారణంగానే తారక్ రాలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విదేశాల్లో ఉండిపోవడంతోనే మేనత్త అంత్యక్రియలకు రాలేకపోయి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా ఉమామహేశ్వరిని కడసారి చూసేందుకు తారక్ రాకపోడవంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి.. ఎన్టీఆర్.. మేనత్త ఉమా మహేశ్వరి కడసారి చూపుకు రాకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.