నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనే ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. దీంతో ఆ కుటుంబం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా అనారోగ్యం,మానసిక ఒత్తిడితో భాద పడుతున్నట్లు సన్నిహితులు తెలిపారు. ఈ క్రమంలో ఉమామహేశ్వరి గతానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ కు నలుగురు కూతుళ్లు అని అందరికీ తెలిసిందే. నలుగురు కూతుళ్లలో పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, ఉమా మహేశ్వరి అందరికీ పెళ్లై, పిల్లలు ఉన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, లోకేశ్వరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్లు రాజకీయాల్లో, చారిటీ ట్రస్టుల ద్వారా ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే చిన్న కూతురు ఉమామహేశ్వరి జీవితం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమె జీవితంలో ఎన్నో అష్టకష్టాలు పడ్డారు. ఉమామహేశ్వరి జీవితంలో చాలా విషాదం నిండింది. ఆమెని నరేంద్ర రాజన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. దాంతో ఆమె అమెరికాలో కొంత కాలం నివాసం ఉన్నారు. అప్పుడు తన కాపురంలో అనేక చిత్ర హింసలకు ఆమె గురయ్యారు. రాజన్ శాడిస్ట్ అని, చాలా హింసించేవాడని, శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టేవాడని కొంత మంది బంధువులకు అప్పట్లోనే చెప్పింది. తన భర్త సిగరెట్ తో కాల్చేవాడని చెప్తూ ఉమా మహేశ్వరి చాలా కుంగిపోయిందని సన్నిహితులు తెలిపారు. చివరకు ఈ చిత్ర హింసలు భరించలేక తండ్రి ఎన్టీఆర్ తో చెప్పింది. కూతురి బాధలు విని బాధ పడ్డ ఆయన వెంటనే నరేంద్ర రాజన్ కు విడాకులు ఇప్పించేశాడు. ఆ తరువాత ఆమె రెండో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె తన జీవితాన్ని చాలా ప్రశాంతగా గడుపుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఇలా ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం అని సన్నిహితులు వాపోతున్నారు. మరి ఉమామహేశ్వరి జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Kantamaneni Uma Maheswari: ఎన్టీఆర్ కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్యకి కారణాలు! ఇదీ చదవండి: Tollywood: షూటింగ్స్ బంద్ సరే! థియేటర్లలో జరిగే మోసాలు పట్టించుకోరా..?