తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందాలో స్టార్ హీరోల సరసన నటించిన కుర్రాళ్లకు సెగలు పుట్టించిన రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తల్లి, అత్త పాత్రల్లో నటిస్తు మంచి ఫామ్ లో కొనసాగుతుంది. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో శివగామి పాత్రలో నటించి విమర్శకులచే ప్రశంసలు పొందింది.
ప్రస్తుతం రమ్యకృష్ణ వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటుంది. బంగార్రాజు’, ‘రంగ మార్తాండ’, ‘రిపబ్లిక్, లైగర్’ వంటి చిత్రాలలో రమ్య ముఖ్య పాత్రలు పోషిస్తుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో సెలబ్రెటీలు ఎలాంటి పార్టీలు చేసుకోకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఈ మద్య కరోనా తగ్గుముఖం పట్టడంతో సెలబ్స్ బయటకు వస్తున్నారు. ఆ మధ్య సుహాసిని బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోగా, ఆ పార్టీలో కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, రమ్యకృష్ణ, కుష్బూ మరియు బంధుమిత్రులు తెగ సందడి చేశారు.
ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ తన పుట్టిన రోజు వేడక తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య బర్త్ డేని గ్రాండ్గా జరుపుకుంది. ఆ పార్టీలో రాధిక, ఖుష్బూ, లిజీ, మధుబాల, త్రిష, రెజీనాలతో పాటు కొందరు నటీనటులు హాజరయ్యారు. పార్టీలో ప్రతి ఒక్కరు తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ఖుష్బూ.. రమ్య బర్త్ డే వేడుకకు సంబంధించిన పిక్స్ షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి. ఇటీవల సీనియర్ నటి సుమలత కూడా ఇటీవల తన బర్త్ డే వేడుక జరుపుకోగా, ఆ వేడుకకు కన్నడ నటుడు ఉపేంద్ర, కేజీఎఫ్ చిత్రంతో ఫుల్ ఫేమస్ అయిన యష్ అటెండ్ అయ్యారు.