గత కొంతకాలంగా నరేష్, రమ్య రఘుపతి మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. నరేష్ రమ్య రఘుపతిని వదిలేసి.. పవిత్రా లోకేష్ తో ఉంటున్నారు. ఈ క్రమంలో నరేష్, పవిత్రా లోకేష్ ల మీద రమ్య రఘుపతి వరుస విమర్శలు చేస్తున్నారు. రోజు రోజుకి ముదిరిపోతోన్నా ఈ వివాదంలో రమ్య రఘుపతికి సంబంధించిన ఆడియో కాల్ ఒకటి సంచలనం రేపుతోంది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరుతో బెదిరింపులకు దిగిందని నరేష్ ఆరోపిస్తున్నారు. 10 కోట్ల రూపాయలు ఇస్తే సెటిల్మెంట్ చేసుకుంటాను అని ఆమె మధ్యవర్తి ద్వారా బేరసారాలు చేసిందని.. బెదిరింపులకు సంబంధించిన కీలక ఆధారాలు తన దగ్గర ఉన్నాయని నరేష్ అన్నారు.
మధ్యవర్తితో మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి లీక్ అయ్యింది. ఆ ఆడియో కాల్ లో రమ్య.. 10 కోట్లకు సెటిల్మెంట్ ఇవ్వడానికి తాను సిద్ధమని వెల్లడించింది. రమ్య నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్ మరియు అతని కుటుంబ సభ్యులు. అక్రమంగా తమ ఇంట్లో తిష్ట వేసిందని.. రమ్యను ఇంట్లోంచి వెళ్లిపోయేలా ఆదేశాలు జారీ చేయాలని నరేష్ మరియు అతని కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇక రమ్య వల్ల తన కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుందని, ఫైనాన్షియల్ స్కాములు చేసే రమ్య దగ్గర తన కొడుకు ఉండడం ఇష్టం లేదని నరేష్ ఆరోపించారు. ఆస్తి కోసం భర్తనే చంపాలనున్న రమ్య దగ్గర తన కొడుకును ఉంచద్దు అంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.
తన కొడుకు బాధ్యత తనదే అని, కొడుకుకు గార్డియన్ గా తననే నియమించాలని, తన కొడుకు చదువు కోసం ఏటా రూ. 4 లక్షలు ఖర్చు పెడుతున్నానని.. తన కొడుకుని తన దగ్గరే ఉండేలా చేయాలని ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పెళ్ళైన నెల నుంచి తనను వేధించేదని, ఇంటికొస్తే అన్నం కూడా పెట్టేది కాదని, పార్టీలకు, ఫంక్షన్స్ కి వెళ్తే.. మద్యం తాగి రచ్చ చేసేదని నరేష్ ఆరోపించారు. తన మీద కంటే తన డబ్బు మీదే ఎక్కువ ప్రేమ ఉందని, డబ్బు కోసం ఇప్పుడు తనను చంపేందుకు కూడా సిద్ధమైందని ఆరోపించారు. మరి నరేష్, రమ్య రఘుపతిల వివాదంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.