తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు స్పందించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. చిత్ర పరిశ్రమకు ఆయన ఎంతో సేవ చేశారు. కానీ, చివరి చూపు కోసం ఎవరూ రాకపోవడం ఆయనను ఆవమానించినట్లేనంటూ కొందరు నటులు బహిరంగంగానే పెదవి విరిచారు. రాకేష్ మాస్టర్ సినీ పరిశ్రమలో చాలా ఏళ్లుగా రాణించి దాదాపు 1500 పాటలకు గాను కొరియోగ్రాఫీ చేశారు. కానీ, ఇంత చేసినా ఆయనకు ఎలాంటి గుర్తింపు దక్కలేదని మరికొందరి వాదన.
ఇదిలా ఉంటే, చాలా ఏళ్ల నుంచి రాకేష్ మాస్టర్ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. అప్పటి నుంచి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచారు. అప్పటి నుంచే ఆయన పట్ల నెగిటివిటీ ప్రచారం జరిగిందని ఆయన సన్నిహితులు కొందరు వాదిస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే రాకేష్ మాస్టర్ కుమారుడు సైతం స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మా నాన్న ఇలా చెడిపోవడాని మీడియానే ప్రధాన కారణమంటూ తెలిపాడు. తమ లబ్ది కోసమే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు మా నాన్నను ఇంటర్వూలు చేస్తూ పూర్తి నెగిటివిటీని చూపించాయి, తద్వారా ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. ఇక నుంచైనా అలాంటి వీడియోలు చూపించడం ఆపేయండి. మా ఫ్యామిలీని మీడియాలో ఎక్స్ పోజ్ చేసి మా జీవితాలను మరింత చీకట్లకు లాగొద్దంటూ వేడుకున్నాడు. రాకేష్ మాస్టర్ కుమారుడు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.