ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్ర సందండి కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ మంచి వసుళ్లు రాబడుతోంది. ఈ మధ్యే చిత్ర యూనిట్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరికీ తెలిసేలా.. పుష్ప 2020 బిగెస్ట్ ఇండియన్ గ్రాసర్ అంటూ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్ర మేకర్స్ ఏకంగా 285 కోట్లు గ్రాస్ వచ్చిందని ప్రకటించారు.
ముఖ్యంగా తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళంలో ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. హిందీలో కేవలం 10 కోట్లకు సినిమాను అమ్మితే ఇప్పటికే 24 కోట్ల షేర్ వచ్చింది. మరోవైపు తమిళనాడులో కూడా 5 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చాడు పుష్ప రాజ్. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే.. పుష్ప చిత్రం మరో రికార్డు కూడా బద్దలుకొట్టినట్లు సమాచారం.
బాహుబలి, కేజియఫ్ తర్వాత ఉత్తరాది ప్రేక్షకుల ఆకట్టుకున్న చిత్రంగా పుష్ప నిలిచింది. తాజాగా హిందీలో కేజీఎఫ్ రికార్డును పుష్ప మూవీ బ్రేక్ చేసింది. ఈ సినిమా కేజీఎఫ్ హిందీలో సాధించిన వసూళ్లను దాటేసింది. మూడేళ్ల కింద యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ కేజియఫ్. అప్పట్లో థియేటర్ల వద్ద ఈ సినిమా చేసిన సందడి అంతాఇంత కాదు. ఈ సినిమా బాలీవుడ్ లో 45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అయితే.. ఇప్పుడు ఈ రికార్డును అల్లు అర్జున్ బద్దలుకొట్టాడు. పుష్ప సినిమాకు 47 కోట్లు రావడంతో KGF రికార్డు బద్దలు అయిపోయింది. మరి… బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కేజిఎఫ్ రికార్డ్ ని పుష్ప బీట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.