స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన మూవీ ‘సీతారామం’. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, సుమంత్ , తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించారు. ఇక ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇంత ఖర్చు పెట్టి సినిమాను తీయటం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎక్కడెక్కడికో వెళ్లి షూటింగ్ చేస్తారు. కానీ కొన్ని సినిమాలు థియేటర్ లో మాత్రమే చూడాలి. ఉదహారణగా చెబుతూ.. ఇంట్లో పూజ గది ఉంది కదా అని గుడికి వెళ్లడం మానేస్తామా అంటూ ప్రభాస్ తెలిపారు. ఇక మా సినిమా ఫీల్డ్ లో ఉన్నవారికి థియేటర్లే దేవుడి గుడిలాంటివని డార్లింగ్ ప్రభాస్ అన్నారు. తాజాగా ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కాస్త వైరల్ మారుతున్నాయి. ప్రభాస్ లెటెస్ట్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.