పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజాహెగ్డే జంటగా నటించిన పీరియాడిక్ ప్రేమకథా చిత్రం “రాధే శ్యామ్”. గత ఏడాదిన్నర కాలంగా ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చింది.. “రాధేశ్యామ్” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తొలి షో నుంచే ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చోసుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇదే సమయంలో ఓ థియేటర్ వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది.
రాధేశ్యామ్ సినిమా విడులైన కారంపూడిలోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సినిమా విడుదల సందర్భంగా చల్లా కోటేశ్వరరావు (37) అనే ప్రభాస్ అభిమాని ఫ్లెక్సీ కడుతుండగా అది ఒక్కసారిగా విరిగి.. పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. దీంతో దాన్ని పట్టుకుని ఉన్న కోటేశ్వరరావు కరెంట్ షాక్ కు గురయ్యాడు. అతడితో పాటు మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.