అనుకున్నదే జరిగింది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా వాయిదా పడిపోయింది. కొన్నాళ్ల నుంచి అందరూ ఏదైతే అనుకుంటున్నారో.. రియాలిటీలో కూడా అదే జరిగింది. కొత్త రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు. కాదు కాదు అలా చేయాల్సి వచ్చింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇకపోతే సినిమా అంటే ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలి. కానీ ‘ఆదిపురుష్’ టీజరే చాలామందిని ఫుల్ డిసప్పాయింట్ చేసింది. దీంతో లెక్కలేనన్ని ట్రోలింగ్స్ వచ్చాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’ తర్వాత డార్లింగ్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. చాలామంది బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా క్యూ కట్టారు. అందులో ఓం రౌత్ కూడా ఒకడు. ‘తాన్హాజీ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అతడు.. రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ తీయాలని ఫిక్సయ్యాడు. ప్రభాస్ ని హీరోగా ఎంపిక చేశాడు. త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో దీన్ని తీస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ టీజర్ రిలీజయ్యాకే అసలు చిక్కొచ్చి పడింది.
ఎంతో ఆశగా, ఆత్రుతగా ఎదురుచూసిన ఫ్యాన్స్.. ‘ఆదిపురుష్’ టీజర్ చూసి షాకయ్యారు. ఇదేంటి ప్రభాస్ లాంటి స్టార్ హీరోను పెట్టి.. ఏకంగా కార్టున్ సినిమా తీస్తారా అని ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఇక సినిమా మీద ఓ రేంజ్లో ట్రోల్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా రావణుడి లుక్పై వివరీతమైన విమర్శలు రావడంతో మూవీ టీమ్ పై ఒత్తిడి పెరిగిపోయింది. ‘ఆదిపురుష్’పై అప్పటివరకు ఉన్న అంచనాలు ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. దీంతో సంక్రాతి బరి నుంచి ఈ సినిమా తప్పుకుంది.
దీనికి తోడు రాముడికి కోర మీసం, హనుమంతుడి పాత్ర లెదర్ తో చేసిన వాటిని ధరించడం లాంటి వాటిపై నెటిజన్స్ చాలా విమర్శలు చేశారు. దీంతో వీఎఫ్ఎక్స్ విషయంలో మూవీ టీమ్ పునరాలోచించుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే రూ.100 కోట్ల మేర అదనంగా ఖర్చు చేస్తున్నారనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ రాకపోయినప్పటికీ.. రిలీజ్ డేట్ మార్చుతున్నట్లు డైరెక్టర్ ఓం రౌత్ స్వయంగా చెప్పాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా జూన్ 16న థియేటర్లలోకి తీసుకొస్తామని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.