పరుచూరి బ్రదర్స్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక గొప్ప రచయితలుగా, నటులుగా వారు తెలుగు సినిమాకి చేసిన సేవ ఎంతో గొప్పది. అయితే ఇటీవల పరుచూరి వెంకటేశ్వరరావు పిక్ ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. నెరిసిన జుట్టుతో బాగా చిక్కిపోయి కనిపించారు. ఆ ఫొటోచూసి ఎంతో మంది అభిమానులు ఎందుకు ఇలా అయిపోయారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఏదైనా వ్యాధితో బాధపడుతున్నారా? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చలు చూసి ఆయన సోదరుడు పరుచూరి గోపాల కృష్ణ స్పందించారు.
ఇదీ చదవండి: రానా తండ్రి కాబోతున్నారా.. ప్రెగ్నెన్సీ వార్తలపై మిహికా కామెంట్స్!
‘అన్నయ్య ఆరోగ్యంగానే ఉన్నాడు. ఎవరూ భయపడాల్సింది ఏమీ లేదు. ఆయన మేధస్సు ఇంకా అంతే ఉంది. ఇటీవల కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కాకపోతే 2017లో మేము ఆస్ట్రేలియా వెళ్లి వచ్చిన తర్వాత ఆయనలో కొంత మార్పు వచ్చింది. అప్పుడు వైద్య పరీక్షలు చేయించాం. అప్పుడు కొన్ని ఆహార నియమాలు సూచించారు. ఆ తర్వాత అన్నయ్య 10 కిలోలు తగ్గారు. జుట్టుకు రంగు వేయకపోవడం వల్ల అలా కనిపిస్తున్నారు. ఫొటో షేర్ చేసిన జయంత్ ను కూడా ఎందుకు అప్ లోడ్ చేశావు అని అడిగాను. అందరూ ఆందోళన చెందుతుంటే.. ఒక అభిమాని మాత్రం కరెక్ట్ గా స్పందించారు. ఆయనకు 80 ఏళ్లు వస్తున్నాయి.. వయసు రీత్యా అలా ఉన్నారు అంతే ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని అడిగారు. కరెక్ట్ గా చెప్పారు అనిపించింది. వయసు పెరిగే కొద్దీ శరీర ధర్మాలు మారుతుంటాయి. అన్నయ్య ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందకండి’ అంటూ గోపాల కృష్ణ క్లారిటీ ఇచ్చారు. గోపాల కృష్ణ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.