సినీ ఇండస్ట్రీలో ఈ మద్య బయోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా సినిమాలను రూపొందిస్తున్నారు. రాజకీయ రంగానికి చెందిన మన్మోహన్ సింగ్, వైఎస్ రాజశేఖర్, జయలలిత జీవితాలకు సంబంధించిన బయోపిక్స్ వచ్చాయి. ఈ క్రమంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జీవిత కథ ఆధారంగా చేసుకొని బయోపిక్ ని రూపొందించేందుకు మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.
‘అటల్’ పేరు తో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. ఆ పాత్రలో మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి నటిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ప్రముఖ రచయిత ఉల్లేక్ ఎన్.పి రాసిన ‘ది అన్ టోల్డ్ వాజ్ పేయి: పొలిటీషియన్ అండ్ పారాడాక్స్ ’ అనే బుక్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రంలో వాజ్ పేయి గొప్పతనం, ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.. ఆయన జీవితంలో జరిగే ముఖ్య ఘట్టాలను చూపించబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.
ఈ మూవీ వాజ్ పేయి 99వ జయంతిని పురస్కరించుకొని క్రిస్మస్ కి రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు నిర్మాతల్లో ఒకరైన సందీప్ సింగ్ తెలిపారు. గతంలో సందీప్ సింగ్ ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించారు. ఇక అటల్ మూవీలో టైటిల్ రోల్ పోషిస్తున్న పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన గొప్ప వ్యక్తి వాజ్ పేయి బయోపిక్ లో నటించడం నాకు లభించిన గొప్ప గౌరవం’ అన్నారు. దివంగత అటల్ బిహారి వాజ్ పేయి బయోపిక్ వస్తున్న విషయంపై సినీ, రాజకీయ రంగాల్లో ఆసక్తి నెలకొంది.
#AtalBihariVajpayeeBiopic: पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी की बायोपिक में मुख्य भूमिका निभाएंगे पंकज त्रिपाठी@TripathiiPankaj @meranamravi @thisissandeeps @BJP4India #PankajTripathiInAtal #pankajtripathi #AtalBihariVajpayee #moneycontrolhttps://t.co/hDW0czbw13
— Moneycontrol Hindi (@MoneycontrolH) November 18, 2022