గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా, మీడియాలో.. నరేష్, పవిత్రా లోకేష్ ప్రేమ, పెళ్లి వ్యవహారం.. దీనిపై ఆయన భార్య రమ్య రఘుపతి చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన వార్తలు జోరుగా వస్తున్నాయి. తాజాగా డిసెంబర్ 31న.. నరేష్, పవిత్రా లోకేష్ తమ ముద్దు వీడియోతో ఇయర్ ఎండింగ్కి.. ఎవరూ ఊహించని షాక్ ఇచ్చారు. కొత్త ఆరంభం.. అందరూ బాగుండాలి.. అందులో మేముండాలి అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ లిప్లాక్ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వీడియోపై స్పందిస్తూ.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజా ఇంటర్వ్యూలో రమ్య రఘుపతి నరేష్తో తన రిలేషన్.. వీరద్దరి గొడవల వల్ల వారి కుమారుడు ఎంత బాధ పడుతున్నాడో.. వివరించారు. అలానే నరేష్ తనకు విడాకులు ఇచ్చాడని.. 200, 300 కోట్ల రూపాయలు భరణం ఇచ్చాడంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అబద్దమని తేల్చి చెప్పారు రమ్య రఘుపతి. తామింకా.. లీగల్గా భార్యాభర్తలమే అని.. తమకు ఇంకా విడాకులు రాలేదని రమ్య రఘుపతి స్పష్టం చేశారు. తనకు, తన కుమారుడికి విడాకులు తీసుకోవాలని లేదని.. అందుకే తాను నరేష్కు విడాకులు ఇవ్వడం లేదని తెలిపింది. అయితే నరేష్ మాత్రం.. తనకు విడాకులు ఇచ్చి.. పవిత్రా లోకేష్ని వివాహం చేసుకోవాలని భావిస్తున్నాడని.. కానీ అది అంత ఈజీగా జరగదని రమ్య రఘుపతి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది అని తెలిపింది.
‘‘ఇక నరేష్ నాకు విడాకులు ఇస్తే.. భారీ మొత్తంలో భరణం వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అవన్ని అబద్ధాలే. నేను కోర్టులో వేసిన పిటిషన్ కూడా.. నా భర్తతో తిరిగి కలిసి ఉండాలని వేసిందే. నేను, నా కొడుకు విడిపోవాలని అనుకోవడం లేదు. దాని కోసం ఫైట్ చేస్తున్నాం. ముందు విడాకులు వస్తే.. ఆ తర్వాత సెటిల్ మెంట్ వ్యవహారం తెర మీదకు వస్తుంది. అసలు విడాకులే ఇవ్వనప్పుడు సెటిల్మెంట్ ఎలా జరుగుతుంది. నాకు కావాల్సింది న్యాయం.. సెటిల్మెంట్ కాదు. నా మీద ఇన్ని ఆరోపణలు చేశావ్ కదా నరేష్.. ఛాలెంజ్ చేస్తున్నాను.. అవన్ని నిజమని నిరూపించూ.. లేదంటే.. మీడియా ముందుకు వచ్చి మాట్లాడు’’ అని రమ్య రఘుపతి సవాల్ చేశారు.