Naresh shocking allegations On Third Wife Ramya Raghupathi: ప్రస్తుతం ఇండస్ట్రీలో మూడో భార్యతో నరేష్ విడాకులు, పవిత్రా లోకేష్తో ఆయన రిలేషన్ గురించి జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక నరేష్ పవిత్రా లోకేష్తో సహజీవనం చేస్తున్నాడు.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు ప్రచారం అవుతుండగా.. మరో వైపు పవిత్రా లోకేష్కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీటి మధ్యలో నరేష్ మూడో భార్య రమ్య కూడా నరేష్తో తన అనుబంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. నరేష్ తన మూడో భార్యని వదిలేసి ఎనిమిదేళ్లు అవుతుందని అంటుంటే.. ఆమె మాత్రం జస్ట్ వారం ముందు వరకూ మేం కలిసే ఉన్నాం అని అంటుంది. తన భర్త తనని మోసం చేసి విడాకులు తీసుకోకుండా నటి పవిత్రా లోకేష్ని పెళ్లి చేసుకున్నాడని మీడియాకి తెలిపింది.
ఈ క్రమంలో నరేష్ తన మూడో భార్య చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఆమెపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమెకు డ్రైవర్తో అక్రమ సంబంధం ఉందంటూ.. ఆమె తన కుటుంబాన్ని నాశనం చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు నరేష్. తాజాగా మరో వీడియోలో నరేష్ మాట్లాడుతూ.. ‘‘నా భార్య రమ్య రఘుపతితో విడిపోయి ఎనిమిదేళ్లు అయ్యింది. హిందూపురంలో ఆమె ఆర్ధిక మోసాలకు పాల్పడింది. చాలామందిని ఇబ్బంది పెట్టింది. అనంతరం హైదరాబాద్ వచ్చిన రెండేళ్లలోనే ఆర్గనైజ్ క్రైమ్ కోసం.. ఆర్ధిక మోసాలకు పాల్పడింది. పోలీస్ కేసు నమోదు కాకుండా సెటిల్ చేసుకుంది. అక్కడ నుంచి మళ్లీ బెంగుళూరు వెళ్లి.. అక్కడ ఓ బ్లాక్ మెయిల్ ఛానల్తో కలిసి.. నా గురించి వదంతులు వ్యాపింపజేస్తుంది. అసత్య ప్రచారం చేస్తుంది’’ అని ఆరోపించాడు.
ఇది కూడా చదవండి: Suchendra Prasad: పవిత్రా లోకేష్పై భర్త సుచేంద్ర ప్రసాద్ సంచలన ఆరోపణలు.. ‘నరేష్తో 6 నెలలే ఉంటుంది’!
‘‘నన్ను డబ్బులు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేయడంతో నేను రూ.10 లక్షలు ఇచ్చాను.. అవి తీసుకుని నా పెద్ద వాళ్ల దగ్గరకు వెళ్లి రూ.50 లక్షలు ఇవ్వాలని పీడించింది. నాపై అనేక గొడవలు చేసింది.. దీంతో నేను ఆమెకు డైవర్స్ పేపర్స్ పంపించాను. అవి పంపి నెల అవుతుంది. డైవర్స్ పేపర్స్ పంపిన తరువాత నుంచి నాకు పెళ్లైందని.. పెళ్లి కాబోతుందని నాపై తప్పుడు ప్రచారాలు చేస్తుంది. కర్ణాటక వెళ్లి అక్కడ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. అందుకే నేను కర్ణాటక వెళ్లి అన్ని నిజాలను బయటపెట్టాను. కర్ణాటక ప్రజలు కూడా నాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ ఛానల్స్లో రచ్చ మొదలుపెట్టింది. నేను పడ్డ 8 ఏళ్ల హింస.. నాకు జరిగిన బ్లాక్ మెయిల్ వల్లే నేను విడాకులు తీసుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు నరేష్.
ఇది కూడా చదవండి: Meena: భర్త మరణం తర్వాత తొలిసారి స్పందించిన నటి మీనా
‘‘కానీ ఆమె దీన్ని పవిత్రా లోకేష్తో లింక్ చేసి.. ఆమె వల్లే నేను విడాకులు తీసుకుంటున్నానని చెప్పడం చాలా తప్పు. ఖచ్చితంగా పవిత్రా లోకేష్ కూడా దీనిపై మాట్లాడుతుంది. మా రిలేషన్ షిప్, మా ఫ్రెండ్ షిప్ మాది. మేం ఎప్పుడూ ముక్కుసూటిగానే ఉంటాం. తప్పు చేస్తే భయపడాలి.. చేతకాకపోతే భయపడాలి.. నాకు ఈ రెండూ లేవు. మేం దెయ్యాలకు భయపడం.. దేవుడికి భయపడతాం. మీడియా సోదరులకు ప్రజలకు చెప్తున్నా.. అన్ని ఆధారాలను బయటపెడతా.. మళ్లీ మీతో మాట్లాడతాను. మమ్మల్ని అర్ధం చేసుకుని సపోర్ట్ చేయాలని కోరుతున్నాను’’ అని కోరాడు నరేష్. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Ramya Raghupathi: నరేష్, పవిత్రా లోకేష్లకు పెళ్లయిందంటున్న మూడో భార్య రమ్య