నటుడు నరేష్ ఇంటిపై పలువురు దుండగులు దాడి చేశారు. దీంతో నరేష్ పర్సనల్ లైఫ్ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు.
టాలీవుడ్ లోని బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నరేష్ కచ్చితంగా ఉంటారు. ఈ హీరో ఆ హీరో అనే డిఫరెన్స్ లేకుండా దాదాపు అందరూ స్టార్స్ సినిమాల్లో నటిస్తుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. గత కొన్నాళ్ల నుంచి మూవీస్ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఎక్కువగా వార్తల్లో ఉంటూ వచ్చారు. దానికి కారణం ఇద్దరు. వాళ్లే నటి పవిత్రా లోకేష్, మాజీ భార్య రమ్య రఘుపతి. వీళ్ల ముగ్గురి మధ్య జరుగుతున్న ఈ ఇష్యూ కాస్త సోషల్ మీడియాలో ఎప్పుడూ బర్నింగ్ టాపికే. ఇప్పుడు అదంతా కాదన్నట్లు జరిగిన మరో సంఘటన ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నరేష్ గుర్తింపు తెచ్చుకున్నారు. విజయనిర్మల వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించారు. ఫాదర్, మామ, లాయర్ పాత్రలతో ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. మూడో భార్య రమ్య రఘుపతి నుంచి విడిపోయి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నటి పవిత్రా లోకేష్ తో కలిసి చాలాసార్లు కనిపించాడు. ఇక న్యూయర్ సందర్భంగా నరేష్-పవిత్రా లోకేష్ రిలీజ్ చేసిన ముద్దు వీడియో అయితే అందరికీ షాకిచ్చింది. దీంతో నరేష్-రమ్య మధ్య మాటలు, చేతుల విషయంలో చిన్నసైజ్ గొడవ జరుగుతున్నట్లే ఉంది.
తాజాగా నరేష్ ఇంటిపై దుండగులు దాడి చేయడంతో.. ఈ భార్యభర్తల మధ్య గొడవ కాస్త మరోసారి హాట్ టాపిక్ అయింది. నరేష్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులు.. క్యారవాన్ తో పాటు పలు వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో నరేష్ ఫిర్యాదు చేశాడు. రమ్య రఘుపతి దాడిచేసిందని తన కంప్లైంట్ లో రాసుకొచ్చాడు. చిన్నది అనుకున్న ఈ ఇష్యూ కాస్త చిలికి చిలికి గాలివానలా మారింది. మరి ఇది ఏ తీరానికి అది కూడా ఎప్పుడు చేరుతుందో అనేది చూడాలి. మరి నరేష్ ఇంటిపై దుండగులు దాడి చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.