నందమూరి తారకరత్నకు, ఆయన కుటుంబానికి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి.. రాకపోకలు సాగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తారకరత్న అంత్యక్రియల నాడు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చూస్తే.. ఈ అనుమానాలు వస్తున్నాయి. తాజాగా మరో సంఘటనతో ఈ అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఆ వివరాలు..
నందమూరి తారకరత్న మృతి చెందిన వారం రోజుల పది రోజులు గడుస్తున్నాయి. తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. చివరకు ఫిబ్రవరి 18న శివరాత్రి రోజున తుది శ్వాస విడిచారు. తారకరత్నను బతికించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. విదేశాల నుంచి వైద్యులను రప్పించారు. కానీ ఆ ప్రయత్నాలు అన్ని వృధా అయ్యాయి. కానీ తారకరత్న విషయంలో చివరకు విధే గెలిచింది. ఆయనను శాశ్వతంగా ఈ లోకం నుంచి దూరం చేసింది. ఇక తారకరత్న మృతి తర్వాత పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేరిన తారకరత్న.. అక్కడే కన్నుమూశారు. అనంతరం తారకరత్న మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్లో ఆయన నివాసం మోకిలాకు తరలించారు. అయితే తారకరత్న తల్లిదండ్రులు అక్కడకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నందమూరి కుటుంబ సభ్యులు, చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర సెలబ్రిటీలు, బంధుమిత్రులు మోకిలా వెళ్లి తారకరత్నకు నివాళులర్పించారు. కానీ తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ ఆయన భార్య శాంతి.. కొడుకును చివరిసారి చూసేందుకు మోకిలా వెళ్లలేదు. అనంతరం అభిమానుల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఫిలిం చాంబర్కి తరలించారు. దాంతో తారకరత్న తల్లిదండ్రులు ఫిలిం చాంబర్కి వచ్చి కుమారుడిని కడసారి చూసుకుని.. గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అయితే తారకరత్న తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా అలేఖ్యారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో వారు ఆయనను దూరం పెట్టారు. అయితే గత కొన్ని ఏళ్లుగానే తారకరత్నతో మంచి సంబంధాలు మొదలయ్యాయి. కానీ తల్లిదండ్రులు మాత్రం ఇంకా దూరంగానే ఉన్నారని సమాచారం. అందుకే వారు కన్నకొడుకును కడసారి చూసేందుకు మోకిలా రాలేదని తెలిపారు సన్నిహితులు. మోకిలాలో తారకరత్న నివాసం ఉంటున్న ఇళ్లు.. ఆయన భార్య అలేఖ్యారెడ్డి తరఫు వాళ్లది కాబట్టి వారు అక్కడకు వెళ్లలేదని తెలిసింది. అయితే కొందరు సన్నిహితులు మాత్రం అవన్ని అవాస్తవాలు అని ఖండించారు.
ఇక తాజాగా మరోసారి తారకరత్న తల్లిదండ్రుల తీరు చర్చనీయాంశంగా మారింది. తారకరత్న దశదిన కర్మకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. తారకరత్న ఫిబ్రవరి 18న మృతి చెందారని.. మార్చి 2న ఆయన పెద్దకర్మ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరుగుతుందని పేర్కొన్నారు. తారకరత్న మృతి పట్ల నందమూరి బాలకృష్ణ, వేణుంబాక విజయ్ సాయి రెడ్డి అలాగే వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి అని ప్రకటించారు. అలానే మరో పక్క అలేఖ్య రెడ్డి కుటుంబానికి సంబంధించిన టి మధుసూదన్ రెడ్డి, టి శ్రీ హరిప్రియ, టి అవనీష్, టి ముక్తి అనే పేర్లు ప్రింట్ చేశారు.
దాంతో పాటు నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పేరు వారి కుమార్తె నిష్క, కుమారుడు తనయ్ రామ్, కుమార్తె రేయ పేర్లను పోస్టర్ మీద ప్రింట్ చేశారు. కానీ దీని మీద ఎక్కడా తారకరత్న తల్లిదండ్రుల పేర్లు ప్రింట్ చేయకపోవడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కావాలనే వారు పేర్లు వేయలేదా.. లేక వేరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది తెలియదు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sri NANDAMURI TARAKA RATNA Pedda Karma will takeplace on Thursday, 2nd March 2023, 12:00pm Onwards at Film Nagar Cultural Centre, Hyderabad.#NandamuriTarakaRatna #TarakaRatna #JrNTR #NandamuriBalakrishna pic.twitter.com/BmFRqua3aB
— SumanTV (@SumanTvOfficial) February 25, 2023